
విజయవాడలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను పోలీస్లు గృహనిర్బంధించినప్పుడు షర్మిల తనను అకారణంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. కనీసం ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారో కారణమైనా చెప్పాలంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను ఎందుకు గృహ నిర్బంధం చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. పీసీసీ కార్యాలయానికి వెళ్లడం కూడా నేరమా? అంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెబుతున్నారని, రాజ్యాంగ హక్కులను సైతం ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందంటూ షర్మిల ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తోన్న తప్పులు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడమే నేరమైందాని షర్మిల చేస్తున్న అభియోగాలు కారణమా లేక ఇంకేమైన కారణాలు ఉన్నాయాని, అసలు ఇంత హడావుడిగా షర్మిలను గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటాని రాజకీయ వర్గాలలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు రాజకీయనాయకులు కలుసుకున్న ఇదే చర్చ నడుస్తోంది.
షర్మిలా జగన్ల మధ్య గత కొన్ని రోజుల క్రితమే ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో సయోధ్య కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొన్నటి వరకు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఒక వైపు భాగం షర్మిల మరో వైపు భాగం జగన్ ఉపయోగించుకునేవారు. ఇప్పుడు లోటస్ పాండ్ మొత్తం షర్మిల స్వాధీనం అవ్వడంతో విశ్వసనీయవర్గాల వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది.
అయితే, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సూపర్ సిక్స్ పథకాలను ఎన్డీఏ నేతలు ప్రకటించారు. అవన్నీ అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం కొంత విఫలమయ్యింది. గత ప్రభుత్వంలో జగన్ అప్పులు చేశారని, పథకాలు అమలుకు ఆర్ధిక ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని చంద్రబాబు చాలా సార్లు ప్రజలకు చెప్పారు. ఒకవేళ అప్పులు చేసిన జగన్ తమకు డబ్బులు నేరుగా తమ అకౌంట్లలో జమ చేశారని, ఇచ్చిన హామీలను అమలు చేశారని ప్రజలు అనుకుంటున్నారు. మరో వైపు తనకు ఎంతో అనుభవం ఉన్నట్టుగా చెప్పుకునే బాబు హామీలు అమలు చేయలేక పోయారని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. ఇంకా జగన్కు ప్రజలలో మళ్లీ ఆదరణ పెరుగుతుందని ప్రభుత్వ గూఢాచార శాఖ సీఎం చంద్రబాబుకు రిపోర్టులు ఇచ్చిందని కూడా రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూటమితో చెట్టాపట్టాలేసుకొని షర్మిల తిరిగారు. అయితే, పిసిసి అధ్యక్షురాలిగా షర్మిలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావటానికి, కాంగ్రెస్ మాజీ మిత్రులే కారణమని ఎన్నికలప్పుడు బహిరంగంగానే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ గత కొంత కాలంగా ప్రజాస్వామ్యవాదులు చేస్తున్నవే, ఇన్నాళ్ల నుంచి కూడా ఎప్పుడో ఒకసారి అధిష్టానం కంటతడి తుడవటం కోసం ఆంధ్రకు వచ్చిపోయే షర్మిలా, ఒంటెద్దు పోకడలతో ప్రజాసమస్యలు పట్టని షర్మిలా ఇప్పుడు ప్రజాసమస్యలపై గళ మెత్తటంతో గృహ నిర్భంధం చేశారని వ్యాఖ్యానించటం సొంత పార్టీ వారే తీవ్రంగా ఖండిస్తున్నారు.
అయితే, గతంలో కూడా అమరావతికి మద్దతు తెలియచేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు షర్మిల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నేతనే కావటం, అందులోను బాబుకు రేవంత్కు గురు శిష్యుల అనుబంధం ఉండటం. ఇంకా 2019 ఎన్నికలలో కాంగ్రెస్తో జతకట్టటం వంటి కారణాలతో ఇప్పటికి చంద్రబాబుతో కాంగ్రెస్కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినప్పటికీ బాబు ఇటువంటి చర్య తీసుకోవటంలో బీజేపీ ప్రోద్బలం ఉందా లేక టీడీపీనే చేసిందానే విషయంలో కొంత స్పష్టత కరువవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.