
“భారతదేశం కలిగి ఉన్న అతిపెద్ద ఆస్తులలో వివేకం, సత్యం, న్యాయమైన ఇంకా హేతుబద్ధమైన అవగాహన పూరితమైన వార్తలు సమాచార వనరుల అవసరం ఉన్న ఈ క్లిష్టమైన సమయంలో ఈ కఠినమైన సెన్సార్షిప్ను మేము నిరసిస్తున్నాము.”
2025 మే 9న అనేక మంది ద వైర్ పాఠకులు ద వైర్ ఇంగ్లీష్ పోర్టల్ వెబ్సైట్ thewire.in ని చదవకుండా డిజిటల్ అవరోధాలు కలుగుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ద వైర్ ప్రకటనను విడుదల చేశాము.

ప్రియమైన ద వైర్ పాఠకులారా,
భారతదేశ వ్యాప్తంగా పాఠకులు thewire.in ను చదవకుండా యాక్సెస్ ను భారత ప్రభుత్వం నిరోధించింది. ఈ చర్య పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుంది. “ఐటి చట్టం- 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ది వైర్ ను బ్లాక్ చేశాము” అని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తెలియజేశారు.
భారతదేశం కలిగి ఉన్న అతిపెద్ద ఆస్తులలో వివేకం, సత్యం, న్యాయమైన ఇంకా హేతుబద్ధమైన స్వరాలతో కూడుకున్న వార్తలు, సమాచార వనరులు ఉన్న ఈ క్లిష్టమైన సమయంలో ఈ కఠినమైన సెన్సార్షిప్ను మేము నిరసిస్తున్నాము.
ఈ ఏకపక్ష, వివరించలేని చర్యను సవాలు చేయడానికి మేము అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాము.
మీ మద్దతు గత 10 సంవత్సరాలుగా మా పనిని మమ్ములను ముందుకు నడిపించింది. ఇటువంటి సమయంలో మనమందరం కలిసి నిలబడతామని మేము ఆశిస్తున్నాము.
మా పాఠకులందరికీ సత్యమైన, ఖచ్చితమైన వార్తలను అందించే ప్రయత్నం లో నిరుత్సాహం మమ్ములను దరి చేరలేదని మీకు హామీ ఇస్తున్నాము.
సత్యమేవ జయతే.
తేదీ: మే 9, 2025
గమనిక : ఈ వార్త ప్రచురించే సమయానికి ది వైర్ ఇంగ్లీషు వెబ్ సైట్ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.