
భారత వాయుసేన చేసిన క్షిపణి దాడులలో చనిపోయిన 31 మంది మరణాలకూ బదులు తీర్చుకుంటామని పాకిస్తాన్ హెచ్చరించింది. ఇది రెండు అణు సామర్థ్యం కలిగిన దేశల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తలనూ, దానితో పాటు అనేక భయాలనూ పెంచింది.
బుధవారం రాత్రి పొద్దుపోయాక మీడియాకు పంపిన సందేశంలో పాకిస్తాన్(ప్రధాని) షెహబాజ్ షరీఫ్ “మేం ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. అమరవీరులు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు మేం ప్రతీకారం చెల్లిస్తాం” అని ప్రకటించారు.
పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్, పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని తొమ్మిది ఎంచుకున్న లక్ష్యాలపై దాడులు చేయడం ద్వారా భారత్ ఒక అగ్నిగుండాన్ని రగిల్చిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించిన కాసేపటికే ఈయన వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశానికి తగురీతిలో బదులు చెప్పాలని తన మిలటరీకి ఆదేశించింది”
గతనెల చివరి వారంలో భారత ఆధీన కశ్మీర్పై జరిగిన దాడికి ప్రతీకారంగా తాము ఈ దాడులు చేపట్టామని ఇండియా ప్రకటించింది. ఆనాటి ఘటనలో తీవ్రవాద దాడులలో 25 హిందూ పర్యాటకులను, వారి ఒక ముస్లిం గైడును చంపివేశారు. పాకిస్తాన్ ఎప్పటి నుంచో సహకారం అందిస్తున్న ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు నేరుగా ఈ దాడులకు పాల్పడ్డారని పాకిస్తాన్పై భారతదేశం ఆరోపణలు చేసింది.
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖా మంత్రి ఇషాక్దర్, ఇస్లామాబాద్లో గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “తమ దేశం తమ దేశపు గౌరవాన్ని రక్షించుకోవడానికి “ఎంత దూరమైన” వెళ్తుందని చెప్పారు.” సాయుధ దళాలకు ఇందుకు బదులుగా ఏ చర్యలైనా తీసుకోమని ఆదేశించే హక్కును మేం కలిగి ఉంటాం. అది సమతుల్యంగా, బాధ్యతాయుతంగా, లెక్క ప్రకారమే ఉంటుంది.” అని తెలిపారు.
ఏదైనా కాలగడవులోగా ఈ ప్రతీకాత్మక దాడులు జరుగుతాయన్న చర్చలోకి రావడానికి తిరస్కరిస్తూ, మా ప్రణాళికనైతే దేశపు సాయుధ దళాల అధిపతి జనరల్ అసిమ్ ముసద్, సంకీర్ణ ప్రభుత్వాన్ని సంప్రదింపులలోకి తీసుకోని చర్చలు జరిపి, చర్చలకు అనుగుణంగా ఆచరణలో పెడతారని ప్రకటించారు. ఎప్పుడు, ఎలా, ఏం చర్యలుంటాయనేది ఈ దశలో చర్చించడం అపరిపక్వం అని దర్ చెప్పారు. కనీస లేదా గరిష్ఠ కాలపరిమితి అంటూ లేదని” బదులు చెప్పారు.
ఇండియా సాగిస్తున్న ఆరోపణలు, దాడులు ఎన్ని ఉన్నా, ఇప్పటి వరకూ పాకిస్తాన్ ఓర్పును, గరిష్ఠ సంయమనాన్ని ప్రదర్శించదని దర్ పేర్కొన్నారు. “అవును, ఏ పూర్తిస్థాయి యుద్ధమైనా, దాని తీవ్ర ఆర్థిక నష్టాలు కూడా తోడై ఉంటాయి. కానీ సార్వభౌమాధికారం, దేశ సమైక్యత, భూభాగాల సమైక్యత, దేశ గౌరవం వంటి వాటి విషయంలో ఖరీదు గురించి మాట్లాడలేం” అని అన్నారు.
అంతర్జాతీయ సమాజంపై కూడా దర్ తన నిరాశను వ్యక్తీకరించారు. సంయమనం పాటించమని చెప్పడం మినహా, భారత్- పాకిస్తాన్ మధ్య చిరకాలంగా ఉన్న ఈ వివాదం గురించి మరేమీ చేయడానికి ముందుకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ దాడులపై ఒక స్వతంత్ర పరిశోధన చేయించాల్సిందిగా తాము చేస్తున్న అభ్యర్థునలను ఏనాడు పట్టించుకోవడం లేదని కూడా ఆయన వాపోయారు.
ఇండియా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలను తగ్గించేందకు, అప్పుడప్పుడూ పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా గతంలో అమెరికా ప్రెసిడెంట్లు చాలా చురుకుగా వ్యవహరించేవారని, కానీ నేడు ట్రంప్ అటువంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించేందుకు సిద్ధంగా లేరని దర్ చెప్పారు. “అవును, గతంలో అమెరికన్ ప్రెసిడెంట్లు చాలా చురుకైన పాత్రను పోషించారు. కానీ ఎవరికి వారికే తమదైన సమాధానం ఉంటుంది” అని కూడా అన్నారు.
భారత్- పాకిస్తాన్ల మధ్య జరిగే యుద్ధ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమతమై ఉండదు. కాబట్టి, అంతర్జాతీయ సమాజాలు కూడా బాధ్యత వహించాలి. అంతేకాకుండా అంతర్జాతీయ సరిహద్దులను ఇది దాటుతుందని అన్నారు.
బుధవారం జరిగిన వాయి దాడులలో 31 మంది మృతి చెందారు. అయితే, ఇందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. మరికొన్ని డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అనంతరం, పాకిస్తాన్పై విజయం సాధించామని భారత దేశం విజయాన్ని ప్రకటించుకుంది.
అయితే, రెండు ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఎంతో కాలంగా పాకిస్తాన్ భూభాగాన్ని కేంద్రంగా చేసుకొని భారతదేశంపై అనేక భయంకరమైన తీవ్రవాద దాడులకు పాల్పడుతున్నందున, ఆ తీవ్రవాదదాడులను, వారికి శిక్షణ ఇస్తున్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని, భారత సైన్యం చెపుతున్నది.
“మా అమాయకులను చంపినవాళ్లని మాత్రమే మేము చంపాం” అని భారత రక్షణ శాఖామంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హోం శాఖామంత్రి అమిత్షా “భారతదేశ ప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన రీతిలో బదులు ఇచ్చేందుకు కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది” అన్నారు.
ఈ క్షిపణి దాడిని “ఉద్రిక్తతలు పెంచేవిగా కాకుండా, సమతూకంతో, బాధ్యతాయుతంగా ఉన్నామని” భారత సైన్యం వర్ణించింది.
“అన్యాయమైన ఈ దాడులలో అనేకమంది అమాయకులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు చనిపోయారని ఇక్కడ ఎటువంటి తీవ్రవాద క్యాంపులు, నిర్వహణ ఉనికిలోనే లేవని” పాకిస్తాన్ చెపుతోంది. భారతదేశం దాడులు చేసిన చోట ఏ తీవ్రవాద అచూకీ లేదని దర్ పునరుద్ఘాటించారు.
1991లో జరిగిన భారత్- పాకిస్తాన్ యుద్ధానంతరం, భారత క్షిపణులు పంజాబ్ లోపలికి చొచ్చుకుని వచ్చాయని, పాకిస్తానీలకు రాజకీయంగా, సైనికపరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంలో కనీసం 16 మంది చంపేపోయారు.
జాతీయ భద్రతా దళాల సమావేశంలో, బుధవారంనాడు షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యానికి ప్రతిచర్య తీసుకునేందుకు తమ దేశ సార్వభౌమత్వాన్ని, రక్షించుకునేందుకు తగిన సమయంలో, తగిన స్థలం వద్ద, తనదైన ఎంపికలతో వ్యవహరించే అధికారాన్ని కట్టబెట్టింది.
పార్లమెంట్ సమావేశంలో బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహాధినేత పాకిస్తాన్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని పునరుద్ఘాటించారు. అయితే, పాకిస్తాన్ నుంచి సమాధానం ఇంకా రావాల్సి ఉందని అన్నారు.
హిమాలయ పర్వత సానువులలో ఉండే కశ్మీర్పై వివాదం భారతదేశ విభజన, 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచే ఉంది. భారత్- పాకిస్తాన్లు రెండూ కశ్మీర్ను పూర్తిగా తమకే చెందాలంటూ ఉంటాయి. కానీ రెండు కొంత, కొంత భూభాగాలకు పరిమితమై, ప్రపంచంలోనే ఎక్కువ సైన్యాన్ని మోహరించే సరిహద్దులు కల్గినవిగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ ఒకటి 1947- 48 యుద్ధం తర్వాత. యుద్ధ విరమణ ఒప్పందంలో భాగంగా ఏర్పడింది. తూర్పు వైపున చైనా ఆధీనంలో కొంత భాగం ఉంది.
ఇండియా- పాకిస్తాన్లు కశ్మీర్ విషయంపై మూడుసార్లు చివరగా 1990లో యుద్ధానికి వెళ్లాయి.
బుధవారం నాడు జరిగిన దాడులలో భారతదేశం కూడా నష్టపోయిందన్న సూచనలు ఉన్నాయి. తమ దేశం నుంచే తాము దాడి చేసినప్పటికీ, పాకిస్తాన్ చెపుతున్న దాని ప్రకారం 80 భారతీయ జెట్లు దాడులకు పాల్పడ్డాయని కానీ తాము కేవలం అయిదింటిని మాత్రమే కూల్చివేసి సంయమనాన్ని వహించామని అన్నారు.
భారత ప్రభుత్వం, తమ విమానాల కూల్చివేయబడటంపై పెదవి విప్పటం లేదు. కానీ కూల్చబడిన విమాన శకలాలు భారతదేశం ఆధీన కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో భారత్లోని పంజాబ్ రాష్ట్రాలలో ఉన్నాయన్న వార్తలందాయి.
భారత కశ్మీర్లోని వుయాన్కు చెందిన అద్నాన్ అహ్మద్(25) ఒంటిగంట నలభై నిమిషాల ప్రాంతంలో ఒక పెద్ద పేలుడు శబ్దం విన్నానని చెప్పాడు. “నేను కిటికీ వద్దకు పరుగెత్తాను. ఒక యుద్ధ విమానం జ్వాలలతో క్రిందికి పడిపోతుండటం చూశాను. దాని పై భాగాన మరో యుద్ధ విమానం ఎగురుతూ ఉంది. అది ఒక స్కూలు భవనం దగ్గరలో చెట్లను తాకుతూ భూమిపై దిగింది. పలు పేలుళ్లు గంటసేపు జరిగాయి” అని చెప్పారు.
తెల్లవారుజాము నుంచి భారత్- పాకిస్తాన్ సైన్యాల మధ్య వాస్తవాధీన రేఖ సరిహద్దు వెంబడి భారీగా కాల్పులు ఇరువైపులా సాగుతున్నాయి. భారత ఆధీన కశ్మీర్లో 12 మంది భారతదేశపు పౌరులు మరణించినట్లు చెపుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి 5 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.
ఫూంచ్ ముఖ్య ఆరోగ్య శాక అధికారి పర్వేజ్ ఖాన్ లెక్కల ప్రకారం ఫూంచ్ బాగా దెబ్బతిన్నదని, 42 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారని చెప్పాడు.
“మా ఇద్దరు బంధువులు ఒక ఫిరంగి గుండు తగిలి గాయపడ్డారు” అని సఫీర్ అబ్దుల్లా ప్రకటించాడు.
“తరాల నుంచి మేము, మా పూర్వీకులు హింసను భరిస్తూనే ఉన్నాం. ప్రతి గంట ఇదే చివరి గంటలా అన్పిస్తోంది. సరిహద్దులకు 150 కిలో మీటర్ల దూరం వరకూ ఎవరూ నిద్రపోవడం లేదు” అన్నాడు.
“వేలాది మంది ఆ ప్రాంతాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భయంతో బ్రతుకుతున్నారు, తుపాకీ గుళ్లు వర్షంలా కూరుస్తున్నాయి, చాలా ఇళ్లు ఒక సిక్కు గురుద్వారా, వ్యవసాయ భూములు, వాహనాలు బాగా దెబ్బతిన్నాయి” అని తెలియజేశారు.
అబ్దుల్ ఖాన్ మరో నివాసి. రాత్రి నుంచి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో ఆ ఇంటి బేస్మెంట్లోనే కాలం గడుపుతున్నట్లు చెప్పాడు. “చాలా మందిలా మాకు తప్పించుకుని సురక్షిత ప్రదేశానికి వెళ్లే అవకాశం లభించలేదు” అని ఆయన చెప్పారు.
బుధవారం నాడు అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ ఉద్రిక్తలు చల్లార్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరాయి. కీర్స్టార్మర్, బ్రిటిష్ ప్రధాని తక్షణమే ఇరుదేశాలు చర్చలు ప్రారంభించాలని, ఉద్రిక్తతలు చల్లార్చాలని, పౌరులను రక్షించుకోవాలని కోరారు.
డోనాల్డ్ ట్రంప్, భారత్- పాకిస్తాన్లు యుద్ధాన్ని తక్షణమే ఆపాలని కోరారు. “ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాలని నేను కోరుతున్నాను, మేం ఇరు దేశాలతో బాగానే ఉంటాం. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్- పాకిస్తాన్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని కోరుకుంటున్నాను.” అని ట్రంప్ అన్నారు.
హన్నా ఎల్లస్- పీటర్సన్(ఢిల్లీ)
షామీర్ బాలోచ్ (ఇస్లామాబాద్)
ఆకాన్ హసన్(కశ్మీర్)
అనువాదం: ఐ వీ రమణారావు
ద గార్డియన్ సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.