
అమెరికా మొదటి మహిళ జిల్ బిడెన్కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రం ధర 20,000 డాలర్లు. అంటే మన రూపాయి విలువలో లెక్కిస్తే 17 లక్షల 14వేలు. మన దేశ పౌరులు చెల్లించిన పన్నుల నుండి వచ్చిన 20,000 డాలర్లతో ఇక్కడ, భారతదేశంలో ఏవిధంగా ఎన్ని పనులకు ఖర్చుపెట్టవచ్చో, ఎంతమందికి ఉపయోగపడేలా ఖర్చు పెట్టవచ్చో చూద్దాం.
మరొక కోణంలో చెప్పాలంటే, ఉపాధ్యాయుల జీతాలు మొదలుకొని మరుగుదొడ్లు మరియు బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు వరకు అనేక ప్రజా ప్రయోజనాలు, సౌకర్యాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు రూ. 17.14 లక్షల నిధులను ఎలా ఉపయోగించవచ్చనే విషయాన్ని ది వైర్ పరిశీలించింది.
వివిధ సందర్భాలలో విదేశీ ప్రముఖులకు ప్రధాని ఇచ్చిన కానుకల ధరను వెల్లడిరచడానికి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినప్పటికీ, 2023లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్కు ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రం విలువ సుమారు 20,000 డాలర్లు ఉంటుందని వాషింగ్టన్ వెల్లడిరచింది.
2023 జనవరి 7 నాటికీ డాలర్తో రూపాయి విలువ 85.7 గా ఉంది. మోడీ బహుమతిగా ఇచ్చిన 7.5 క్యారెట్ల వజ్రం విలువ రూ.17,14,000. ఇది తక్కువేమీ కాదు – వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడిరచిన సమాచారం ప్రకారం, 2023 లో విదేశీ ప్రముఖుల నుండి బిడెన్ దంపతులు అందుకున్న బహుమతులలో ఇదే అత్యంత ఖరీదైన బహుమతి.
రూ. 17.14 లక్షలను భారతదేశం లో అయితే ఏఏ అవసరాలకు ఖర్చు చేయచ్చో చూద్దాం.
నలుగురు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 12 నెలల జీతం.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో తయారు చేసిన ‘స్టేట్ ఆఫ్ టీచర్స్, టీచింగ్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’ 2023 నివేదిక ప్రకారం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నెలకు పొందే సగటు జీతం రూ. 31,255/-. ఈ లెక్కన చూస్తే, రూ.17.14 లక్షలతో నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 12 నెలలకుగాను ఏడాదిపొడవునా వేతనాలు చెల్లించవచ్చు.
2021-22 లెక్కలప్రకారం భారతదేశంలోని 21 ప్రధాన రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 14.7% పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలేనని ‘ది హిందూ’ కథనం వెల్లడిరచింది. ఈ రాష్ట్రాలలో , అటువంటి ప్రతి పాఠశాలలో సగటున 33 మంది విద్యార్థులు ఉన్నారు. బీహార్లో సగటున 96 మంది వరకు ఉండవచ్చు. అటువంటి పాఠశాలల్లో అదనంగా మరొక ఉపాధ్యాయుణ్ణి నియమించినట్లయితే ఎంతోమంది పిల్లల జీవితాల్లో ఖచ్చితంగా మార్పు తీసుకురాగలరు.
2.77 లక్షల మధ్యాహ్న భోజనాలు
ఇటీవల సవరించిన ప్రభుత్వ అంచనాల ప్రకారం, చాలా రాష్ట్రాలతో పాటు ఢల్లీి మరియు పుదుచ్చేరిలో బాల వాటికా మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం సరుకుల కోసం ఒక పిల్లవాడికి రోజుకు రూ. 6.19/- చొప్పున కేటాయిస్తారు. 7.5 క్యారెట్ వజ్రం వ్యయంతో ఈ విద్యార్థులకు 2,76,898 మధ్యాహ్న భోజనాలను అందించవచ్చు.
గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం ఢల్లీి, గోవా మరియు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పాఠశాలల్లో వంటమనిషి మరియు హెల్పర్లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల పని చేస్తారు. వారికి నెలకు కేవలం రూ.1,000/- గౌరవ వేతనం చెల్లిస్తారు. కొన్ని ఇతర రాష్ట్రాలలో ఇందుకు భిన్నంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పైన ఆధారపడి గౌరవ వేతనం రూ. 12,000 వరకు ఉంటుంది.
ఈ సమాచారం సరైనదైతే, అటువంటి 342 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 17.14 లక్షలు ఒకసారి రూ. 5,000/- బోనస్ ఇవ్వడానికి తోడ్పాడతాయి.
స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్ పధకం కింద 142 మరుగుదొడ్లకు ప్రోత్సాహకాలు
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ పథకం అమలు కోసం ఎంపిక చేయబడిన లబ్ధిదారుల ఇళ్లలో ‘వ్యక్తిగత మరుగుదొడ్ల’ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12,000/- ప్రోత్సాహాకాన్ని అందిస్తుంది. ఈ కుటుంబాలన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే. వారి ఇంట్లో మరుగుదొడ్డి లేదు. అటువంటి 142 ఇండ్లకు మరుగుదొడ్లను మంజూరు చేయటానికి అవసరమైన ఖర్చును రూ.17.14 లక్షలు ద్వారా భరించవచ్చు.
ఇద్దరు సభ్యులు పనిచేసే 34 కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని
ఒక గ్రామీణ కుటుంబంలో ఇద్దరు పని చేసే సభ్యులు ఉన్నారని, వారికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం సంవత్సరానికి 100 రోజుల పని దొరుకుతుందని భావించినట్లయితే, ప్రతి వ్యక్తికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సగటు వేతనం రోజుకు రూ. 249.67 అవుతుంది. అంటే రూ. 17.14 లక్షలతో అలాంటి 34 కుటుంబాలకు 100 రోజుల ఉపాధి కల్పించవచ్చు.
మాన్యువల్ స్కావెంజర్ (చేతులతో మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు) గా గుర్తించబడిన నలభై రెండు కుటుంబాలు మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్గా గుర్తించబడిన కుటుంబానికి పరిహారంగా రూ.40,000 అందిస్తుంది . 17.14 లక్షలతో 42 కుటుంబాలకు ఈ పరిహారం అందజేయవచ్చు.
అయితే, గత ఐదేళ్లలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మాన్యువల్ స్కావెంజింగ్ కార్మికుల గురించిన సమాచారం కోసం పార్లమెంటులో లేవనేత్తిన ప్రశ్నకు, జూనియర్ మంత్రి రాందాస్ అథవాలే ఈ విషయంపై తమవద్ద ‘‘ఎలాంటి నివేదిక’’ లేదని చెప్పారు. ఈ విధమైన పనిని నిర్ములించటం కోసం పని చేస్తున్న కార్యకర్తలు భారతదేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ తొలగించబడిరదనే వాదనను వ్యతిరేకిస్తున్నారు.
మణిపూర్ హింసాకాండకు గురైన ఒక కుటుంబానికి పునరావాసం
2023లో మణిపూర్లో జరిగిన హింసాత్మక సంఘటనలో మరణించిన వారి కుటుంబానికి / బంధువులకు రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రూ. 17.14 లక్షలతో ఒక బాధితురాలి బంధువులకు పూర్తి పరిహారం చెల్లించవచ్చు.
అధికారిక అంచనాల ప్రకారం మణిపూర్ హింసలో 226 మంది చనిపోయారు. అయితే పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 7.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. (ఒక్కో కేసులో రూ. 10 లక్షల పరిహారంలో కేంద్రం సగం చెల్లిస్తుంది. మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది). ది వైర్ గతంలో రిపోర్ట్ చేసినట్లు కేవలం 147 కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించినట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి.
ప్రధాన మంత్రి అవాస్ యోజన (పట్టణ ) కింద ఆరు ఇళ్లకు సబ్సిడీ
ప్రధాన్ మంత్రి పట్టణ ప్రాంత ఆవాస్ యోజన ‘లబ్దిదారుల నాయకత్వంలో వ్యక్తిగత గృహ నిర్మాణం లేదా మెరుగుదల’ పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు రూ. 2.5 లక్షల వరకు రాయితీపైన ఇళ్లను కేటాయించటానికి ఉద్దేశించబడిరది. మొత్తం రూ. 17.14 లక్షలతో ఈ పథకం కింద ఆరు ఇళ్లకు సబ్సిడీల ఖర్చును భరించవచ్చు.
ఎస్. కె. అనిరుధ్
అనువాదం : పద్మశ్రీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.