
పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన అమరావతిని మళ్లి ప్రారంభించారు ప్రధాని మోడి. సరిగ్గ పదేళ్ల క్రితం మోది చెతులు మీదగా ప్రారంభించిన అమరావతి మళ్లీ పదేళ్ల తరువాత అదే మోది ప్రారంభించారు. ప్రధాని శుక్రవారం అమరావతిలో దాదాపు రూ. 58,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అమరావతి నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని అధికాపార్టీ నేతలు అంటున్నారు. దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అమరావతి పనులు మోదీ ప్రారంభించారు.
ప్రధాని మోదీ ప్రసంగం: అమరావతి ఒక కల, ఒక ఆశయం
“అమరావతి కేవలం నాలుగు గోడల నగరం కాదు, ఇది ఒక కల, ఒక ఆశయం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. నవ్యాంధ్ర, నవ అమరావతిని మనం చూడబోతున్నాం. అభివృద్ధి చెందిన భారతదేశ శక్తి అమరావతిలో కనిపిస్తుంది. ఈ రోజు ప్రారంభించిన అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు అవృద్ధిని వేగవంతం చేస్తాయి,” అని ప్రధాని మోదీ అన్నారు. అమరావతి ప్రాచీన శాతవాహన రాజవంశానికి రాజధానిగా ఉండేదని, బౌద్ధ వారసత్వానికి ప్రసిద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. “ఇంద్రుని రాజధాని పేరు అమరావతి. ఇప్పుడు, అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతోంది. ఇది యాదృచ్చికం కాదు; ఇది శుభసూచకం మరియు స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రారంభం అని నేను ప్రకటిస్తున్నాను,” అని మోదీ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో, అమరావతి సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు, పచ్చని శక్తి, పరిశుభ్రమైన పరిశ్రమలు, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో దేశంలోనే అగ్రగామి నగరంగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
శంకుస్థాపన చేసిన కీలక ప్రాజెక్టులు
ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులలో అమరావతి ప్రభుత్వ సముదాయంలోని ఐదు టవర్లు, హైకోర్టు, శాసనసభ భవన నిర్మాణాలు ఉన్నాయి. అలాగే, 5,200 కుటుంబాలకు గృహ నిర్మాణంతో పాటు 74 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దాదాపు రూ. 49,000 కోట్లు కేటాయించారు వాటిని కూడా ప్రధాని ప్రారంభించారు.
అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరంలో 320 కిలోమీటర్ల పొడవైన ప్రపంచ స్థాయి రవాణా నెట్వర్క్, భూగర్భ యుటిలిటీలు, అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలను కలిగి ఉన్న మౌలిక సదుపాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
అమరావతి: చరిత్ర, ఆటుపోట్లు, మళ్ళీ పునరుజ్జీవం
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు, హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మారడంతో అమరావతిని కొత్త రాజధానిగా పునరుద్ధరించే ఆలోచన మొదటిసారిగా తెరపైకి వచ్చింది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసి మూడు రాజధానుల పార్మాలను తీసుకొచ్చింది అయితే 2024లో చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ తెరపైకి వచ్చింది.
అమరావతి భవిష్యత్తు: ఆశలు, ఆకాంక్షలు
అమరావతి భవిష్యత్తుపై అందరూ ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంజన్ గా మారుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే, అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా అవతరిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడంతోపాటు. ప్రపంచంలోనే అత్యాధునిక రాజధానిగా మరబోతుందని అంటున్నారు అధికారపార్టీ నేతలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.