
ఇది స్వల్ప, దీర్ఘ కాలికంగా పాకిస్తాన్కు ఏ విధంగా హాని చేస్తుంది?
పగల్గాం దాడిలో 26 మంది హత్యకు గురికాగా, పలువురు గాయపడిన ఘటన తర్వాత, 1960నాటి సింధూ జలాల ఒప్పందాన్ని(ఐడబ్ల్యూటీ) నిలిపి వేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్య తక్షణమే ప్రభావం చూపుతుందని తెలిపింది.
ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ను భారతదేశం ఎలా అమలు చేస్తుంది?
భారతదేశం రెండు పనులను చేయగలదు
మొదటిదేంటంటే, పశ్చిమ నదులలో(సింధూ, జీలం, చీనాబ్ ) నియంత్రిత నీటి ప్రవహవాన్నినిలిపివేయడం. ఈ నదులపై నిర్మించబడిన ఆనకట్టలకు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు విడుదలైయ్యే నీటిని ఆపడం. సహజ ప్రవాహం ఈ నదులకు కొనసాగుతుంది. అయినప్పటికీ పాకిస్తాన్ నీటిపారుదల ఇంకా తాగునీటికి కీలకమైన నియంత్రిత విడుదల ఆగిపోవచ్చు. ఉదాహరణకి చీనాబ్ నది మీద నిర్మితమైన బాగిలిహార్ ఆనకట్ట నీటిని నిలుపుకోగలదు, ఇది దిగువకు పాకిస్తాన్వైపు ప్రవాహించే ప్రవాహన్ని తగ్గిస్తుంది.
రెండవదేంటంటే పశ్చిమ నదులైన చీనాబ్ నదిపై ఉన్నటువంటి పాకల్ దూల్(1,000 ఎండబ్ల్యూ), సావల్కోట్(1,856ఎండబ్ల్యూ) నిల్వ ప్రాజెక్టుల అభివృద్ధి నిర్మాణాలను వేగవంతం చేయగలదు. ఇది భవిష్యత్తులో చీనాబ్ నీటి ప్రవాహం మీద భారతదేశ పట్టు పెంచే అవకాశం ఉండడానికి వీలు కల్పిస్తుంది.
అదనంగా సాంకేతిక పరమైన సమావేశాలు, డేటా పంచుకోవడం, సింధూ జలాల ఒప్పంద పరిధిలోని వివాద- పరిష్కార విధానాలు ఆగిపోవచ్చు. నీటి ప్రవాహం మార్పులు లేదా ప్రాజెక్టు రూపురేఖలకు సంబంధించిన విషయాలను భారతదేశం ఇక మీద పాకిస్తాన్కు సమాచారం ఇవ్వడానికి అవకాశం లేదు.
నియంత్రిత, సహజ ప్రవాహం మధ్య వ్యత్యాసం ఏంటి?
సహజ, నియంత్రిత ప్రవాహం మధ్య వ్యత్యాసం గురించి ఐడబ్ల్యూటీలో పేర్కొనబడింది. నీటి కదలిక మానవ జోక్యంతో రూపొందించబడిందా లేదా ప్రాకృతికంగా ఒక కాల వ్యవధిలో తన మార్గాన్ని అనుసరిస్తూ సహజంగా ప్రవహించే విధంగా వదిలివేయబడిందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే, భారత నదుల నియంత్రణ నుంచి పాకిస్తాన్కు అందాల్సిన సహజ ప్రవాహ వాటా హక్కుకు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఐడబ్ల్యూటీని రూపొందించి అమలు చేశారు.
సహజ ప్రవాహం సూచిస్తుంది కదా, నిర్ణీత కాలవ్యవధిలో నిర్దేశిత మార్గంలో నీటి పరిమాణం ఎటువంటి మానవ నిర్మిత మళ్లింపులు, నియంత్రణలు లేకుండా నది నుంచి ప్రవహిస్తుంది. మానవ నిర్మిత నిర్మాణాల నుంచి ఎటువంటి ప్రభావం ఉండకుండా అవపాతం, హిమనదీయ కరుగు, దిగువకు పారే నీటిని ఇది కలుపుకొని ఉంటుంది. ఒకవేళ భారతదేశం పశ్చిమ నదుల మీద ఎటువంటి ఆనకట్టలు, జలాశయాలు లేదా ఎటువంటి కార్యకలాపాలనైనా తన ఆధీనంలోకి తీసుకోకుండా ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉంటే ఈ నీరు పశ్చిమ నదుల నుంచి పాకిస్తాన్కు చేరుకుంటుంది.
నియంత్రిత ప్రవాహంలో మానవ నిర్మిత కట్టడాలు అయినటువంటి ఆనకట్టలు, జలాశయాలు, గేట్లు నీటి ప్రవాహ కదలికను అదుపు చేస్తాయి లేదా నిర్వహిస్తాయి. గేట్లను తెరవడం లేదా మూసివేయడం, స్పైల్వేస్ను కుదించడం, లేదా నిలువ నీటిని విడుదల చేయడం దిగువకు వెళ్లే నిర్దేశిత నీరు, సమయం విషయంలో ఇది కలుగ చేసుకుంటుంది. ఐడబ్ల్యూటీలో పరిధిలో భాగంగా పశ్చిమ నదుల మీద విద్యూత్ ఉత్పాదిత, ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించడానికి భారతదేశం అనుమతి ఇచ్చింది. కానీ, ఇది కచ్చితంగా ”నదీ ప్రవాహం” పథకాలుగా ఉండాలి. దీని అర్థం తాత్కాలికంగా నీటిని నిలుపుతారు లేదా శక్తి ఉత్పాదిత కోసం నీటి ప్రవాహ దిశను మార్చుతారు. కానీ పాకిస్తాన్కు వెళ్తున్న పూర్తి నీటి ప్రవాహాన్ని ఎక్కువగా మార్చలేరు లేదా తగ్గించలేరు.
ఐడబ్ల్యూటీలో భాగంగా పాకిస్తాన్కు నీటి విషయంలో ఏ కేటాయింపులు ఉన్నాయి
సింధూ, జీలం, చీనాబ్ నదులలో 135 మిలియన్ ఎకరాల అడుగులు లేదా ప్రతి సంవత్సరం ఎంఏఎఫ్ను పాకిస్తాన్కు కేటాయించారు. అయితే, భారతదేశం వాటిని ఎటువంటి పరిమిత లేని నదీ ప్రవాహం జలవిద్యుత్ ప్రాజెక్టులకు, 701,000 ఎకరాల వరకు నీటిపారుదల కోసం ఇంకా 3.6 ఎంఏఎఫ్కి పరిమితం చేయబడిన నిల్వ కోసం ఉపయోగించవచ్చు. ఈ ఒప్పందం రియల్-టైమ్ ఫ్లో డేటా మార్పిడిని తప్పనిసరి చేస్తుంది. కానీ విత్తనాలు విత్తడానికి ముందు క్లిష్టమైన కాలాల్లో భారతదేశం నీటిని నిలిపివేస్తుందని పాకిస్తాన్ ఆరోపించినప్పుడు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
జమ్మూ కశ్మీర్ ఇంకా లద్దాక్లోని 13.4 లక్షల ఇరిగేషన్ అభివృద్ధి పనులకు ఐడబ్ల్యూటీ భారతదేశానికి అనుమతి ఇచ్చింది. ఏదిఏమైనా, ప్రస్తుతం 6.42 లక్షల ఎకరాల నీటిపారుదల మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది. ఇంకా, తూర్పు నదుల నుంచి 33 ఎంఏఎఫ్ కేటాయించిన దాంట్లో భారతదేశం 90శాతం మాత్రమే ఉపయోగించుకుంటుంది. భారతదేశం వైపు ఉన్నటువంటి పూర్తి కాని నిర్మాణాల వల్ల ఏదైతే ఉపయోగించని రావికి సంబంధించిన 2 ఎంఏఎఫ్, సట్లేజ్/బియాస్కు సంబంధించిన 5.5 ఎంఏఎఫ్ ప్రవాహం చారిత్రకంగా పాకిస్తాన్కు పారుతోంది.
ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ వల్ల వీటిలో ఏం ప్రభావితమవుతాయి?
హిమనదీయ కరుగుదల, రుతుపవన వర్షాల నుంచి సగటు వార్షిక ప్రవాహం 13 ఎంఏఎఫ్ ఉద్భవిస్తుంది. అంతేకాకుండా ఒప్పంద సస్పెన్షన్తో ప్రభావితం కాకుండా కొనసాగుతుంది. భారతదేశంలోని ఆనకట్టలు, బ్యారేజీల నుంచి నియంత్రిత విడుదలలు దాదాపు 3.6 ఎంఏఎఫ్ నిల్వ సామర్థ్యంతో పొడి సీజన్లలో సహజ ప్రవాహాన్ని భర్తీ చేస్తాయి. ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల భారతదేశం ఈ విడుదలలను ఆపడానికి అనుమతిస్తుంది. కానీ, భారతదేశం ఆ నియంత్రణను అమలు చేయడానికి జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం అటువంటి నిల్వ మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి లేదా అసలు లేవని చెప్పవచ్చు.
ఉత్తమైనదిగా ఈ సామర్థ్యంలో 1.5 ఎంఏఎఫ్ మాత్రమే బగ్లిహార్ ఆనకట్టలో ఉంటుంది. భారతదేశం పశ్చిమ నదుల నుంచి అభివృద్ధి చెందిన నిల్వ సామర్థ్యం వరకు మాత్రమే నీటిని నిలుపుకోగలదు. ఈ నీటిని తక్కువ సీజన్లలో తాత్కాలికంగా నిలుపుకోవచ్చు. కానీ చివరికి దిగువకు విడుదల చేయాలి. అదనపు నిల్వ మౌలిక సదుపాయాలు లేకుండా, భారతదేశం ఎక్కువ నీటిని నిలుపుకోదు. భారతదేశం తన పూర్తి అనుమతి పొందిన నిల్వను(3.6 ఎంఏఎఫ్) నిర్మించినప్పటికీ, అది పాకిస్తాన్కు ప్రవాహాలను తాత్కాలికంగా నియంత్రించవచ్చు ఇంకా ఆలస్యం చేయవచ్చు. ముఖ్యంగా కీలకమైన వ్యవసాయ కాలంలో, కానీ ఈ నీటిని శాశ్వతంగా మళ్లించలేము లేదా వినియోగించలేము.
పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాలు పరిమిత నీటి నిల్వ సామర్థ్యం. మంగళా, టార్బెలా వంటి ప్రధాన ఆనకట్టలు కలిపి 14.4 ఎంఏఎఫ్ ప్రత్యక్ష నిల్వను కలిగి ఉన్నాయి. ఇవి ఐడబ్ల్యూటీ కింద దేశ వార్షిక హక్కులో కేవలం 10% మాత్రమే. నీటి ప్రవాహం తగ్గిన లేదా కాలానుగుణ వైవిధ్య సమయాల్లో, నిల్వలో ఈ కొరత పాకిస్తాన్ను ఎక్కువగా దెబ్బతీయవచ్చు.
ఇది నిజంగా పాకిస్తాన్కు హాని కలిగించగలదా?
పశ్చిమ నదులు 60-70% హిమనదీయ కరగడం ద్వారా ఇంకా 30-40% రుతుపవన వర్షాల ద్వారా ప్రవహిస్తున్నాయి. వీటిని భారతదేశం నియంత్రించలేదు. సహకారం నిలిపివేసినప్పటికీ, ఏటా 131.4 ఎంఏఎఫ్ సహజ ప్రవాహం పాకిస్తాన్కు చేరుతూనే ఉంటుంది. వర్షాకాలంలో(జూలై-సెప్టెంబర్), మూడు నదులలో ప్రవాహం 5,800 m³/s(సెకనుకు క్యూబిక్ మీటర్) మించిపోతుంది. దీనివల్ల కృత్రిమ పరిమితులు అసమర్థంగా మారుతాయి. దీంతో తక్షణ ప్రభావాన్ని చెప్పడం కష్టం, కానీ 2025 వేసవి పంట పండించే సీజన్లలో తగ్గిన ప్రవాహాన్ని నిర్వహించే పాకిస్తాన్ సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు.
భారతదేశం ప్రధాన ప్రాజెక్టులను అమలు చేస్తే, పాకిస్తాన్ స్థితిస్థాపకతను ప్రదర్శించకపోతే దీర్ఘకాలికంగా ప్రభావాలు కనిపిస్తాయి. నిల్వ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా, భారతదేశం పశ్చిమ నదులపై శాశ్వత నియంత్రణను పొందవచ్చు. ఇది పాకిస్తాన్ నీటి ఒత్తిడిని పెంచుతుంది.
చివరికి, వీటంతటి అర్థం ఏంటి?
పాకిస్తాన్కు నీటిని పరిమితం చేసే భారతదేశ సామర్థ్యం సహజ జలసంబంధ చక్రాలు, మౌలిక సదుపాయాల అంతరాలు ఇంకా ఒప్పంద రూపకల్పన నియమాలతో పరిమితం చేయబడింది. సహజ భౌగోళికం ఇంకా ఒప్పంద పరిమితుల కారణంగా కాలానుగుణ వైవిధ్యాలతో సింధు వ్యవస్థ నీటిలో ఎక్కువ భాగం పాకిస్తాన్కు ప్రవహిస్తూనే ఉంటుంది.
పశ్చిమ నదుల నుంచి, నియంత్రిత ప్రవాహాన్ని (3.6 ఎంఏఎఫ్) కొంతవరకు తగ్గించవచ్చు. పాకిస్తాన్కు చేరే నీటిలో ఎక్కువ భాగం (131.4 ఎంఏఎఫ్) సహజంగా ప్రవహిస్తుంది. ఇంకా భారతదేశ నియంత్రణకు మించి ఉంటుంది. పూర్తిగా నిలిపివేయాలంటే భారతదేశం భారీ మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.