
ఒకవేళ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించకపోతే, విశ్వవిద్యాలయాన్ని విదేశ విద్యార్థులకు ప్రవేశాలను ఇవ్వడాన్ని ఆపుతామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. దీని కంటే ముందు ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు విడుదల చేసే 2.7 మిలియన్ డాలర్ల పరిశోధన నిధుల మంజూరును రద్దు చేసింది.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టాప్ అమెరికా విశ్వవిద్యాలయాలకు వ్యతిరేక ఘర్షణ మధ్య, ఒకవేళ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించకపోతే విశ్వవిద్యాలయాన్ని విదేశీ విద్యార్థులకు ప్రవేశాలను ఇవ్వడాన్ని ఆపుతామని ట్రంప్ పాలనా యంత్రాంగం చెప్పింది.
తెలుసుకోవాల్సిందేంటే, ప్రతి సంవత్సరం దాదాపు 500- 800 భారతీయ విద్యార్థులు- స్కాలర్స్ హార్వర్డ్లో చదవడానికి వెళ్తున్నారు.
దేశంలో అన్నింటికంటే పురాతన విశ్వవిద్యాలయంతో ట్రంప్ ఎందుకు గొడవపడుతున్నారంటే అది ప్రవేశం, నియామకం, రాజకీయ అభిప్రాయం మీద నిఘా పెట్టే ట్రంప్ ప్రభుత్వ అభ్యర్థనలను తిరస్కరించింది. ఒకవేళ హార్వర్డ్ తమ డిమాండ్లను అంగీకరిస్తే, ప్రాంగణం లోపల యూద వ్యతిరేక భావంతో పోరడడానికి సహాయం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
గుర్తించదగినదేంటంటే, పాలస్తీనాలోని గాజా మీద ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించే అమెరికాలోని అనేక విశ్వవిద్యాలలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా ఒకటిగా ఉంది.
“హార్వర్డ్ తన రిపోర్టింగ్ అవసరాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని నిర్ధారించలేకపోతే, విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులను చేర్చుకునే విశేష అధికారాన్ని కోల్పోతుంది” అని హోమ్ల్యాండ్ రక్షణా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇంతకుముందు, ఆ విభాగం హార్వర్డ్కు ఇచ్చిన 2.7 మిలియన్ డాలర్ల పరిశోధన గ్రాంట్ను కూడా తిరస్కరించింది.
విశ్వవిద్యాలయం మీద “జాతీయ భద్రతకు ముప్పు” ఇంకా “యూదు వ్యతిరేక భావజాలం ముందు మోకరిల్లు”తోంది అని హోంల్యాండ్ రక్షణా కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ ఆరోపించారు.
అంతేకాకుండా, డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ను “జోక్” అని అభివర్ణించారు. దానికి ఇకపై ప్రభుత్వ నిధులు అందకూడదని అన్నారు. “హార్వర్డ్ ఇకపై నేర్చుకోవడానికి గొప్ప ప్రదేశంగా పరిగణించబడదు. ఇంకా ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలల జాబితాలో స్థానం పొందకూడదు” అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అన్నారు.
“‘హార్వర్డ్ ఒక జోక్, అది ద్వేషాన్ని, మూర్ఖత్వాన్ని బోధిస్తుంది. ఇంకా దానికి ఇకపై సమాఖ్య నిధులు అందకూడదు” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ వారం ప్రారంభంలో వైట్ హౌస్ హార్వర్డ్కు సంబంధించిన 2.2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన గ్రాంట్లను, 60 మిలియన్ డాలర్లు విలువైన కాంట్రాక్టులను నిలిపివేస్తున్నట్లు చెప్పడం గమనించాల్సిన విషయం.
దీని తరువాత, విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలాన్ ఎం గార్బర్ దీనిపై మాట్లాడుతూ , “ప్రభుత్వ ఆదేశం సమాఖ్య ప్రభుత్వ అధికారాలకు మించినది” ఇది హార్వర్డ్ తన మొదటి సవరణ హక్కులను ఉల్లంఘిస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వమూ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏమి బోధించాలో, ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని నియమించుకోవాలో లేదా వారు ఏ అధ్యయన ఇంకా విచారణ రంగాలను అనుసరించవచ్చో నిర్దేశించలేదు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, కొలంబియా విశ్వవిద్యాలయం 400 మిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసినప్పుడు ట్రంప్ ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక డిమాండ్లకు అంగీకరించింది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.