
తమ నిర్ధిష్ట లక్ష్యాలైన పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో ఖచ్చితమైన దాడులు చేసినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకోని భారత సైనిక దళం దాడులను నిర్వహించింది. దీని మీద స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ ఇది అందరు గర్వించదగిన సందర్భమని క్యాబినేట్ సమావేశంలో అన్నారు.
నిర్దిష్టలక్ష్యాలైన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో దాడులు నిర్వహించడంతో భద్రతా బలగాలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. బాలాకోట్ తర్వాత చాలా విస్త్రృతమైన సరిహద్దు దాడులను కేవలం 25 నిమిషాలలో వేగంగా, సమన్వయ మెరుపు దాడులతో భారత ఆర్మీ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద ఆవాసాలను లక్ష్యంగా చేసుకుంది.
నిషేధిత సంస్థలైన జైష్-ఏ- మొహమ్మద్, లష్కర్-ఏ-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన 80 కంటే ఎక్కువ ఉగ్రవాదులు ఈ నిర్దిష్ట దాడులలో చనిపోయారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సైనిక చర్యను అంచనా వేసి లక్ష్యాలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఒక సమావేశంలో తెలిపింది. భారత క్షిపణి దాడులలో తమ 26 మంది పౌరులు చనిపోయారని, 46 మంది గాయపడ్డారని ఇస్లామాబాద్ పేర్కొన్నది.
పాకిస్తాన్ సైనిక స్థావరాలను కాకుండా కేవలం ఉగ్రవాద కేంద్రస్థావరాలపై దాడులను నిర్వహించినట్టుగా భారతదేశం తెలిపింది. “మా చర్యలు కేంద్రీకరించబడ్డాయి, కొలవబడ్డాయి ఇంకా స్వభావరీత్యా ఎక్కువ కావు, లక్ష్యాల ఎంపిక ఇంకా అమలులో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది” అని భారత ప్రభుత్వం ఒక ప్రకటలో తెలియజేసింది.
ఈ దాడిని “నిర్లక్ష్యమైన యుద్ధ చర్య”గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా “తగిన సమాధానం” ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని అన్నారు.
పాకిస్తాన్, పీఓకేలో జరిగిన ప్రస్తుత సైకిక చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి భార్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ ఈ ఆపరేషన్కు సిందూర్ అని కేతనామం పెట్టారు. అయితే, ఉగ్రవాద దాడి వల్ల కలిగే మానవ నష్టం ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.