
పహల్గాం దాడి తర్వాత భారత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారం విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) కూడా పాలుపంచుకుంది.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాలలో పహల్గాం దాడి తర్వాత కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా శ్రీనగర్లో బుధవారం(ఏప్రిల్ 30) విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మద్దతు కూడా లభించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయిన తర్వాత నుంచి, దేశంలోని అనేక రాష్ట్రాలలో కశ్మీరీ విద్యార్థుల మీద దాడులు, వారితో సరిగా ప్రవర్తించకపోవడం వంటి అనేక ఘటనలు ముందుకు వచ్చాయి.
అయితే, పహల్గాం దాడి తర్వాత మొదటి ఆరు రోజులలో దేశవ్యాప్తంగా తక్కువలో తక్కువ ఇలాంటి 17 ఘటనలు వెలుగు చూశాయి. ఈ ఘటనలలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు.
దీని కంటే ముందు, ఎక్కడ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో తమ ప్రభుత్వం మాట్లాడుతుందని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అన్నారు.
అంతేకాకుండా ” నేను ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులో ఉన్నాను. ఇంకా వాళ్లతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరాను.” అని అబ్దుల్లా తెలిపారు. అయితే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కశ్మీర్ విద్యార్థులపై జరుగుతున్న హింసాత్మక దాడుల ఘటనలను జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వెలుగులోకి తెచ్చింది. దాని తర్వాత అబ్దుల్లా ఈ ప్రకటన చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.