
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మొదలు పెట్టిన నిరసన సందర్భంగా హింస రాజుకుంది. దీని తర్వాత అనేక కుటుంబాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అధిక సంఖ్యలోనే ఇటువంటి వ్యక్తులు మాల్దాలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరంలో తలదాచుకున్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనల సందర్భంగా హింస వ్యాపించింది. దీని తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ హింసాత్మక అల్లర్లలో తక్కువలో తక్కువ ముగ్గురు తమ ప్రాణాలను కోల్పోయారు.
శుక్రవారం(11 ఏప్రిల్) హింసకు సంబంధించిన ఘటనలో ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. అంతేకాకుండా 200 కంటే ఎక్కువ మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
“పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. కానీ ఎవరైతే అల్లర్లను చూసి, పరిపోయి తమ ప్రాణాలను కాపాడుకొన్నారో వాళ్ల నమ్మకం ఇప్పటికి కూడా తడబడుతోంది” అని పోలీసులు తెలిపారు.
“చాలా తొందరగా అన్ని విధాలుగా సాధారణ స్థితి పునరుద్ధరించబడుతుంది” అని ఏడీజీ జావెద్ షమీమ్ పేర్కొన్నారు. అంతేకాకుండా “గడిచిన కొన్ని గంటల నుంచి ఎక్కడ కూడా కొత్తగా హింసకు సంబంధించిన వార్త అందలేదు. ఇప్పుడు మా పూర్తి శక్తి సామర్థ్యాలను శాంతిని పునరుద్ధరించడానికి పెడుతున్నాము”అని ఆయన అన్నారు.
తమ దేశంలోనే శరణార్ధులుగా మారిన బాధితులు..
400 కంటే ఎక్కువ మంది స్త్రీలను, మగవారిని ఇంకా పిల్లలను తమ దేశంలోనే శరణార్థులలా ఈ హింస మార్చివేసింది. శరణార్థి కుటుంబాలలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం హింస వ్యాపించిన తర్వాత, చీకటిలో చాలా కష్టంగా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన వారిని మాల్దా జిల్లా పర్లాల్పూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ అధికారులు ఆశ్రయం కల్పించారు. ఎక్కువమంది సుత్తీ, డులియన్ ఇంకా సమ్హేర్గంజ్ ప్రాంతాల వారే బాధితులుగా ఉన్నారు.
రాజుకున్న హింస భయంతో తమ ఇళ్లను విడిచిన వారికి తిరిగి తాము ఎప్పుడు వెనక్కి వెళ్తామో, అసలు వెళ్తామో లేదో అనేది తెలియదు. ఒకవేళ తిరిగి తమ ఇంటికి వెళ్లిన సురక్షితంగా ఉంటామో లేదో అనేది కూడా అనుమానమే.
సబ్జీపాట్టీ(డులియన్)కి చెందిన 40 సంవత్సరాల నమితా మండల్, తన 18 సంవత్సరాల కొడుకుతో పాటు పాఠశాలలో ఆశ్రయం పొందారు. “మేము ఏది కూడా వెంట తీసుకొని రాలేదు. పోలీసు, బీఎస్ఎఫ్ ఏదో ఒక రోజు వెళ్లిపోతారు, అప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు?” అని నమితా మండల్ ఆవేదనతో సందేహాన్ని వ్యక్తం చేశారు.
స్థానిక అధికారులు చెప్పిన ఆధారంగా పీటీఐ అందించిన సమాచారం ప్రకారం, 600 కంటే ఎక్కువ మంది మాల్దాలో ఆశ్రయం పొందారు. ఉన్నత పాఠశాలలోని క్యాంపు కాకుండా తమ పరిసరాలలోని గ్రామాలలో, తమ బంధువుల ఇళ్లలో కొందరు తలదాచుకున్నారు.
గడిచిన రోజులలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజూందార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయ శిబిరాన్ని సందర్శించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పంచుకుంటూ మజూందార్ రాశారుగా “ముర్షీదాబాద్లో తృణమూల్ బలపరిచే జిహాదీ శక్తుల క్రూరమైన దాడుల వల్ల హిందువులు నిరాశ్రయులు అయ్యారు. తమ ఇళ్ల నుంచి పారిపోయి, ఇప్పుడు ఎందరో మాల్దాలోని పర్లాల్పూర్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆశ్రయం పొందారు. ఈరోజు చెదిరిపోయిన బెంగాలీ హిందూ కుటుంబాలను కలిశాను. ఈ సంక్షోభ సమయంలో మేము పూర్తి బలంతో వారికి అండగా నిలబడి ఉన్నాము. నిర్దోషులైన బెంగాలీ హిందువులపై జిహాదీ క్రూరత్వాన్ని మేము ఎప్పుడు సహించము.”
ఏప్రిల్ 14న భవానీ భవన్లో జావేద్ షమీమ్ ప్రెస్మీట్ పెట్టారు. “ఎవరైతే హింస భయంతో తమ ఇళ్లను వదిలి వెళ్లారో, అందులో నుంచి దాదాపు 19 కుటుంబాలు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. మేమందరం కలిసి మిగితా వారిని మెల్లమెల్లగా తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నాం.”
హింస ఏ విధంగా వ్యాపించింది?
ముందు చెప్పిన విధంగా ఏప్రిల్ 11న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా హింస చెలరేగింది.
ద వైర్ హిందీలో అచ్చైన జయదీప్ సర్కార్ రిపోర్ట్ తెలుపుతుందిగా, ముర్షిదీబాద్లోని జంగీపూర్ ప్రాంతంలో ఎప్పుడైతే రాళ్లతో దాడి చేశారో ఆ సమయంలో నిరసన హింసాత్మకంగా మారింది. ముందు నుంచే హింసకు సంబంధించిన సంకేతాలు దొరికిన్నప్పటికీ పోలీసులు సిద్ధంగా లేరు. దీంతో పరిస్థితులు చేదాటిపోయాయి. వేల విద్యార్థులు ఇంకా మైనరిటీ సంఘాల యువకులు రోడ్డులపైకి వచ్చి, జాతీయ రహదారి- 12ను దిగ్బంధించారు. దీంతో ఉత్తర- దక్షిణ బెంగాల్ మధ్యలోని రహదారులు ప్రభావితం అయ్యాయి.
ఆరోపణ ఉందిగా నిరసనకారులు పోలీసుల మీద రాళ్లను రువ్వారు, ప్రభుత్వ బస్సులను, పోలీసు వాహనాలను ఇంకా అంబులెన్స్లను దహనం వేశారు. అంతేకాకుండా మాల్స్లో చొరబడి దోచుకోవడం జరిగింది. జంగీపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఖలీలూర్ రహమాన్ మీద కూడా దాడికి సంబంధించిన సమాచారం వచ్చింది. అయితే, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ను ఉపయోగించాల్సి వచ్చింది.
హింస ఆ మరుసటి రోజు కూడా కొనసాగింది, గుంపు శనివారం(12 ఏప్రిల్) నాడు సంసర్గంజ్లోని జాఫరాబాద్లో సీపీఐ(ఎం) కార్యకర్త హరగోబింద్ దాస్, ఆయన కొడుకు చందన్ దాస్ను వారి ఇంటి నుంచి బయటకు లాగి కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే, ఇద్దరు హింసకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదే కాకుండా, సూఈటీ ప్రాంతంలో ఏప్రిల్ 11న గాయపడిన 21 సంవత్సరాల ఇజాజ్ మోమిన్ శనివారం నాడు చనిపోయారు.
పోలీసులు హింసను ఎందుకు అడ్డుకోలేకపోయారు?
మర్షీదాబాద్ను మొదటి నుంచే మతపరంగా సున్నితమైన జిల్లాగా పరిగణిస్తారు. ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింస చేలరేగింది. ఇదే జిల్లాలో నిరుడు ఏప్రిల్లో రామనవమి సందర్భంగా, మళ్లీ నవంబర్లో కూడా మతపరమైన అల్లర్లు జరిగాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పొలరైజేషన్ ఎంత తీవ్రంగా ఏర్పడిందో ప్రస్తుతం జరిగిన హింస మరోసారి రుజువు చేస్తుంది. ఏప్రిల్ 11 నాడు మొదలైన హింసను 12 ఏప్రిల్ వరకు కూడా పూర్తిగా పోలీసులు అదుపులోకి తేలేకపోయారు. చివరికి కలకత్తా హైకోర్టు ఆదేశాల మీద ఏప్రిల్ 12నాడు రాత్రి నుంచి జిల్లాలోని అనేక ప్రాంతాలలో కేంద్ర బలగాల మోహరించాయి.
13 ఏప్రిల్ ఉదయం నుంచి కేంద్ర- రాష్ట్ర పోలీసుల బలగాలు జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇరు వర్గాలతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధం అయ్యింది.
అసలు ప్రశ్న ఏంటంటే ఒక రోజు కంటే కూడా ఎక్కువ సమయం వరకు శాంతిభద్రతలు ఎందుకు బలహీనంగా ఉన్నాయి? ఈ విధమైన అశాంతిని ముందే ప్రభుత్వం ఎందుకు ఊహించలేకపోయింది? ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ నిఘా సమాచారం దొరకలేదా?
పాత్రికేయులు ఈ విషయం గురించి షమీమ్ను అడిగినప్పుడు “గడిచిన రోజులలో మేము రామనవమి, ఈద్ లాంటి పెద్ద పండుగలను చూశాము, వాటిని ప్రజలు శాంతిపూర్వకంగా జరుపుకున్నారు. మా దగ్గర ఇటువంటి అన్ని విషయాలకు సంబంధించిన నిఘా సమాచారం ఉంటుంది. ఇంకా సీనియర్ అధికారి అందుబాటులో కూడా ఉన్నారు. కానీ ఈ సారి గుంపు అధిక సంఖ్యలో ఉంది.” అని ఆయన సమాధానమిచ్చారు.
మమతా నేతృత్వంపై తలెత్తుతున్న ప్రశ్నలు..
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంపై ప్రస్తుతం హింస పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎందుకంటే, దేశంలోని అనేక భాగాలలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. కానీ, ఎక్కడ కూడా నిరసనలు ముర్షిదాబాద్ హింసలా మాత్రం రూపాంతరం చెందలేదు. అయితే, హింస తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం స్పందించారు. ప్రాంతంలో ప్రజలు శాంతిని నెలకొల్పాలని విన్నవించారు. ఇంకా వక్ఫ్ యాక్ట్ను రాష్ట్రంలో అమలు చేయమని నమ్మకం కల్పించారు.
ఇంకా “మతం పేరు మీద తప్పుగా ప్రవర్తించకండి. మేము ఈ చట్టాన్ని సమర్థించడం లేదు. ఈ చట్టం మన రాష్ర్టంలో అమలు కాదు. మరీ ఈ అల్లర్లు దేనికోసం? అంతేకాకుండా గుర్తుంచుకోండి, అల్లర్లు రెచ్చగొట్టేవారిపై చట్టపరమైనన చర్యలు తీసుకుంటాము” అన్నారు.
మమతా ప్రభుత్వంలో మంత్రి, జమీయత్ ఉలేమా-ఏ- హింద్ బెంగాల్ శాఖ చీఫ్ సిద్దీకుల్లాహ్ చౌదరి కూడా ఈ ఆందోళనకు చెందిన ఒక నాయకుడిగా పరిగణించబడుతున్నారు. ఇంతకు ముందు కూడా రెచ్చగొట్టె ప్రసంగాలు చేసిన ఆరోపణలు చౌదరి మీద ఉన్నాయి. కానీ హింస తర్వాత “ఏదైతే జరిగిందే, అందులో బెంగాల్కు నష్టం జరిగింది. మనం దేశ సెక్యులరిజాన్ని కాపాడాలి. కొన్ని సమూహాలు వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. మేము ముస్లిం వర్గం నుంచి శాంతి నెలకొల్పి ఉంచాలని వినతి చేశాము. ఆదివారం నుంచి మస్జీద్ నుంచి లౌడ్స్పీకర్ మీద ప్రకటన కూడా మొదలైంది” ఆయన చెప్పారు.
స్థానిక ప్రతిపక్ష నాయకులు చెప్పారుగా ఇటువంటి అల్లర్లు ఆకస్మత్తుగా జరగవు, దీనికోసం ముందే వ్యూహ రచన చేస్తారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, ముర్షిదాబాద్ నివాసి అధీర్ రంజన్ చౌదరి “నేను విన్నానుగా ర్యాలీ సన్నద్ధత ఎప్పటి నుంచో అవుతుంది, అయినా కూడా మళ్లీ తమకు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. ముగ్గురు చనిపోయారు! స్థానిక తృణమూల్ కార్యకర్తలు కూడా గుంపులో ఉన్నారని, వాళ్లు దోపిడి చేశారని నాకు నివేదిక అందింది.” అని తెలియజేశారు.
“బెంగాల్లో గడిచిన దశాబ్దంలో మతపరమైన ఉద్రిక్తలు తీవ్రతరం కావడం వైపు ఈ హింస సైగ చేస్తుంది. అంతేకాకుండా రామనవమి ర్యాలీలు, ఆంజనేయ ఆలయం ఇంకా “జై శ్రీరాం” నినాదాల శకటాలు ఇప్పుడు అతివాద ఇస్లామీ సమావేశాలు, షరియావాదులతో ఘర్షణ పడుతున్నాయి. దీంతో సూఫీతత్వం బలహీన పడుతోంది” అని జయదీప్ సర్కార్ రాశారు.
ది వైర్ హిందీ స్టాఫ్
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.