ఇటీవల కాలంలో విద్యుత్ బస్సులపై కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నది. వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. పర్యావరణ హితం కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతున్నది. వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే అసలు విషయం బహిర్గతమవుతుంది. భారత దేశంలో విడుదల అవుతున్న కాలుష్యంలో పరిశ్రమల ద్వారా 50శాతం, వాహనాల ద్వారా 20నుండి 30శాతం ఇతరత్రా కారణాల ద్వారా మిగతా కాలుష్యం విడుదల అవుతున్నది. దేశంలో 2019 మార్చ్ 31 నాటికి (ఆ తర్వాతి వివరాలు ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు) రిజిస్టర్ అయినా వాహనాలలో ద్విచక్ర వాహనాలు 74శాతం, కార్లు, జీపులు, టాక్సీలు కలిపి 12.99 శాతం. బస్సులు 0.69శాతం. అంటే విడుదల అవుతున్న కాలుష్యంలో బస్సుల వాటా. నామమాత్రం. 2019 నాటికి దేశం మొత్తంలో 10లక్షల 47వేల బస్సులుండగా అందులో ఆర్టీసీ బస్సులు కేవలం 1,35,847. ఆర్టీసీ బస్సులు అతి తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు, కేవలం 0.69శాతంగా ఉన్న బస్సుల కాలుష్యం గురించి అంత హడావుడి ఎందుకు? వాహన కాలుష్యంలో సింహ భాగం ద్విచక్ర, కార్లు, జీపుల, ఇతరత్రా నుండి విడుదల అవుతున్నది. దీన్ని నియంత్రించడం సమస్యకు సరైన పరిష్కారం. ఇది జరగాలంటే ప్రజా రవాణాను గణనీయంగా పెంచి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం అత్యంత ఆవశ్యకం. కానీ ఆ దిశగా చేపడుతున్న చర్యలేవి?
ప్రపంచంలోని అత్యధి దేశాలు వ్యక్తిగత వాహనాల వినియోగం (రోజువారీ అవసరాలకోసం) నియంత్రించి ప్రజారవాణాను విస్తృత పరచి వినియోగించుకునేలా చట్టబద్ధంగా పలు చర్యలు చేబడుతున్నాయి. లక్సమ్బర్గ్ దేశంలో ప్రజా రవాణా అందరికి పూర్తిగా ఉచితం. అమెరికాలో సహితం కొన్ని రాష్ట్రాలు, నగరాలలో ప్రజా రవాణా ఉచితం, అతి తక్కువ. ప్రపంచం మొత్తంలో ఏదేశంలో కూడా బస్సుల చార్జీలు నిర్వహణ ఖర్చులో 30-40 శాతానికి మించి వసూలు చేయరు. నిర్వహణ ఖర్చులో అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వివిధ రూపాలలో సర్దుబాటు చేస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ప్రజా రవాణాను లాభనష్టాల స్కేలుతో కొలవరు. కాలుష్య నివారణ గురించి మాట్లాడే ముందు ప్రజా రవాణాను విస్తృత పరచి, అందుబాటు ధరలతో అందరు రోజువారీ అవసరాల కోసం వినియోగించుకునేలా చేయడం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. కాని మన దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్డ్ అత్యధికంగా ఉండటం వ్యక్తిగత వాహనాల పెరుగుదలకు దారితీస్తున్నది. ప్రపంచంలో అన్ని దేశాలలో లక్ష జనాభాకు 60బస్సులున్నాయి. చైనాలో ప్రతి 1000 మందికి 6బస్సులు ఉంటే భారత దేశంలో ప్రతి 10వేల మందికి కేవలం 4బస్సులు మాత్రమే ఉన్నాయని, దేశంలో 90శాతం మందికి సొంత వాహనాలు లేవని స్వయంగా కేంద్ర రవాణా శాఖామాత్యులు నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రజా రవాణా దేశంలో ఎంతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మంత్రి ప్రకటనే తెలియజేస్తున్నది.
ఇక విద్యుత్ బస్సుల విషయానికి వస్తే వాటి ఖరీదు సుమారు రూ.2 కోట్లు. అదే డీజిల్ ఇంజన్ లక్సరీ బస్సు 40లక్షలు, ఆర్డినరీ బస్సు అయితే 25 లక్షలు, ప్రస్తుతం భారత దేశానికి కావలసింది ప్రజల అవసరాలకు తగిన విధంగా బస్సులను పెంచడం, ఇటీవల కేంద్ర మంత్రివర్గం 10వేల విద్యుత్ బస్సులను 169 నగరాలు, పట్టణాలలో ప్రవేశ పెట్టాలని అందుకు రూ. 20వేల కోట్లు కేంద్రం భరించాలని నిర్ణయించింది. ఇదే ఖర్చుతో 40 వేల డీజిల్ బస్సులు కొనుగోలు చేయవచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. విద్యుత్ బస్సులలో ప్రధానమైనది బ్యాటరీ, ఇదే అత్యంత ఖరీదు అయినది. దీన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి, ఛార్జింగ్ వంటి మౌలిక సదుపాయాలకు అదనంగా భారీ ఖర్చు చేయాల్సివుంటుంది, పైగా ఛార్జీంగ్ స్టేషన్లుకు అవసరమైన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు కూడా భారీ ఖర్చుతో చేయాల్సివుంటుంది. విద్యుత్ బస్సులు, చార్జీంగ్ విధానలపై ప్రపంచ వ్యాపితంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మనదేశంలో కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాలలో విద్యుత్ వాహనాల బ్యాటరీకి అవసరమైన లిథియం ఇటీవలే బయట పడింది. అందుచేత మన దేశం మరో పది సంవత్సరాలు వేచి చూడవచ్చు. ఈ లోగా ఖనిజ సంపద, ఇతర మౌలిక సదుపాయాల సమకూర్చుకోవచ్చు. ప్రపంచ వ్యాపితంగా విద్యుత్ బస్సులపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ధరలు కూడా క్రమంగా తగ్గుతాయి. మనం ఇంతగా తొందరపడి ఒళ్లు కాల్చుకోవడం అవసరమా?
ఒకవేళ డీసిల్ బస్సుల కాలుష్యమే అనుకుంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సి.ఎన్.జి) బస్సులను ప్రవేశ పెట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కోసం ఖర్చు చేయనున్న 20వేల కోట్లతోనే షుమారు 30వేల సి. ఎన్.జి బస్సులను ఆర్.టి.సిలకు ఉచితంగా సరఫరా చేయవచ్చు. ఆర్.టి.సిలపైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన అదనపు భారం ఉండదు. ప్రయాణికులకు భారీ ఛార్జీల వడ్డన తప్పుతుంది. కాలుష్య సమస్య పరిష్కారం అవుతుంది.
కానీ ఇందుకు భిన్నంగా ఉరుకులు పరుగులమీద విద్యుత్ బస్సుల కోసం పరుగులు తీయడం వెనుక కారణమేంటీ? ఈ విద్యుత్ బస్సులు ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయాలి. అందుకు వచ్చే సబ్సిడీ వారికే చెల్లించబడుతుంది. ప్రయివేటు వ్యక్తులే ఆర్టీల ద్వారా బస్సులు నడపాలి. అందుకు గాను అర్జీలు వారికి డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం హైదణ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్పోర్టుకు నడుస్తున్న బస్సులు కొత్తగా వివిధ రూట్లలో ప్రవేశపెట్టిన విదు ఇదే తరహాలో నడుస్తున్నాయి, వీటిపై టీఎస్ఆర్టీసీకి వచ్చే ఆదాయంకంటే ప్రయివేటు వారికి చెల్లించే మొత్తం ఎ మొత్తంలో విద్యుత్ బస్సుల కథ ఇదే. ఈ విధానం ఆర్టీసీలకు గుదిబండ అయింది. తాజాగా ఆర్టిసిలు చెల్లించా యా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని మోసి ప్రైవేటు వారికి చెల్లించేలా నిబంధనల మార్పుకు సన్నాహాలు జరుగుతున్నాం. ప్రభుత్వం 2015 నుండి ఫేమ్ 1, 2019 నుండి ఫేమ్ 2 పథకాలను ప్రవేశపెట్టింది. (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) ఫేమ్ 2 విధి విధానాలలోనే బస్సుల కొనుగోలు, నిర్వహణ, నడపడం ప్రయివేటు వారే చేయాలనే షరతు కేంద్రం విధించింది. దీనికి జి.సి.సి. (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) అని పేరు పెట్టింది. అంటే ఖర్చులు, లాభాలు కలుపుకొని నిర్ణయించడం. ఇదే విద్యుత్ బస్సుల కథలోని అసలు రహస్యం, ప్రజల సొమ్మును కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టడం, ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేయడమే పరమావధి.
అత్యంత ఖరీదైన విద్యుత్ బస్సులతో ఛార్జీలు భారీగా వుంటాయి, ప్రస్తుతం తక్కువ ఛార్జీలతో ఆర్.టి.సి బస్సులలో (ముఖ్యంగా ఆర్డినరి) ప్రయాణించే పేదలు విద్యుత్ బస్సుల ఛార్జీలను ఎలా భరించగలరు, ఇది ప్రజల నడ్డి విరిచి మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టడం తప్ప మరొకటి కాదు.
దీని వెనుక మరో పెద్ద కుట్రకోణం కూడా దాగి ఉంది. గ్లోబల్ వార్మింగ్ (పర్యావరణ పరిరక్షణ) పేర శిలాజ ఇంధనాల వాడకం గణనీయంగా తగ్గించాలని, ప్రత్యామ్న్యాయ ఇంధన వినియోగం పెంచాలని ప్రపంచ బ్యాంకు ఆదేశాలు.
అత్యంత ఖరీదైన విద్యుత్ బస్సులతో ఛార్జీలు భారీగా వుంటాయి. ప్రస్తుతం తక్కువ ఛార్జీలతో ఆర్.టి.సి బస్సులలో (ముఖ్యంగా ఆర్డినది) ప్రయాణించే పేదలు విద్యుత్ బస్సుల ఛార్జీలను ఎలా భరించగలరు, ఇది ప్రజల నడ్డి విరిచి మరింత దుర్భర దారిద్య్రంలోకి నెట్టడం తప్ప మరొకటి కాదు.
దీని వెనుక మరో పెద్ద కుట్రకోణం కూడా దాగి ఉంది. గ్లోబల్ వార్మింగ్ (పర్యావరణ పరిరక్షణ) పేర శిలాజ ఇంధనాల వాడకం గణనీయంగా తగ్గించాలని, ప్రత్యామ్న్యాయ ఇంధన వినియోగం పెంచాలని ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. దానికే “జస్ట్ ట్రాన్సిషన్” అని పేరు పెట్టారు. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం 27శాతం వెదజల్లుతున్న దేశం అమెరికా, ఆ తర్వాత 22శాతం యూరోప్ దేశాలు, సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ దేశాలు 9శాతం మాత్రమే. అత్యధిక కాలుష్యం ప్రపంచంపై వదిలి ప్రజల జీవితాలను, వాతావరణాన్ని కలుషితం చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలు ప్రధాన బాధ్యత వహించాలి.
ఇటీవల బాక్లో ముగిసిన కాప్ సదస్సులో కాలుష్య నష్టపరిహరం క్రింద ఒక లక్ష 30వేల కోట్ల డాలర్లు ఇవ్వాలని వర్ధమాన దేశాలు డిమాండ్ చేశాయి. సదస్సును 2 రోజులు పొడిగించి సాగదీసి చివరకు కేవలం 30వేల కోట్ల డాలర్లు విధిలించడానికి ధనిక దేశాలు అంగీకరించాయి. అది కూడ నేరుగా ఆర్ధిక సహాయం కాదు. తాజాగా రెండవ దఫా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన డోనాల్డ్ ట్రంప్ విద్యుత్ వాహనాలకు అడ్డుకట్ట వేసి సిలాజ ఇందనాలను (సాంప్రదాయ ఇంధనాలు) ప్రోత్సహిస్తానని ప్రకటించారు. తదనుగుణంగా 20205 జనవరి 21న తేదీ విడుదల చేసిన ఉత్తర్వులతో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పేందుకు కేటాయించిన నిధులలో 5 బిలియన్ డాలర్లను రద్దు చేశారు. అలాగే బ్రైడన్ ప్రభుత్వం నిర్ణయించిన విద్యుత్ వాహనాల విధానాన్ని రద్దు చేస్తూ జనవరి 22న మరొక ఉత్తర్వులను జారీ చేశారు.
విద్యుత్ వాహనాలకు వ్యతిరేకంగా సాంప్రదాయ ఇంధన వాహనాలకు అమెరికా పెద్దపీట వేస్తుంటే అమెరికాకు అనుగుణంగా మారిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ వాహన ప్రణాళికను నెత్తికెత్తుకొని దేశాన్ని నాశనం పట్టిస్తున్నది. భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు 25 శాతం, శిలాజ ఇంధనాలు 44శాతం, దేశంలో విద్యుత్ తయారీ ప్రధానంగా 78శాతం ధర్మల్ విద్యుతయే. బొగ్గే ఇందుకు ప్రధానం, శిలాజ ఇంధనాలు వాటి అనుబంధ పరిశ్రమలలో 2కోట్ల 15 లక్షల మంది పనిచేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగం సింహభాగాన ఉంది. గాలి, సోలార్ లాంటి కొత్త విద్యుత్ ఉత్పాదన
96శాతం ప్రయివేటు రంగానిది, ఆ విధంగా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి ప్రయివేటు వారికి ధారాదత్తం చేసేందుకు, కోట్లాది మందిని నిరుద్యోగ సైన్యంలోకి నెట్టేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అమెరికాకు లొంగి కార్పొరేట్లకు ఊడిగం చేయడమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలు, విద్యుత్ బస్సులు, కేంద్రం కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
విద్యుత్ బస్సులలో పనిచేసే కార్మికులు ఆర్.టి.సి ఉద్యోగులు కారు. ప్రైవేటు యాజమాని ఇష్టారాజ్యాంగా నియమించుకుంటాడు. హరిజన, గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు అమలు జరుగక వారికి తీరని ద్రోహం జరుగుతుంది. ప్రైవేటు యజమాని నియమించే వారిపై ప్రభుత్వ, ఆర్.టి.సి అజమాయిషి వుండదు, కనీస వేతనాలు, పనిగంటలు, పి.ఎఫ్, ఇ.యస్.ఐ, వారంతపు సెలవులు తదితర హక్కులు, సదుపాయాలు వుండవు. ఇందుకు తిరుపతిలో అమలులో వున్న విద్యుత్ బస్సుల కార్మికులే ప్రత్యక్ష సాక్షులు, వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఉపాధి అంటే గౌరవప్రద జీవనానికి అవసరమైన వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) తీర్మానంలో స్పష్టం చేసింది.
ఆర్.టి.సికి విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడపలలో పలు మౌళిక సదుపాయాలతో కూడిన వర్క్ షాపులు,నిపుణులు అంకిత భావంతో పనిచేసే సిబ్బంది వున్నారు. విద్యుత్ బస్సులే నడపాలని రాష్ట్ర ప్రభుత్వం దృడంగా నిర్ణయించుకుంటే విద్యుత్ బస్సుల తయారికి వీటిని వినియోగించుకోవచ్చు. ప్రధానంగా బస్బడి వీటిలో చేస్తే ఎక్కువ కాలం మన్నికతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. బస్్బడి నిర్మాణం మినహ, విద్యుత్ బస్సులకవసరమైన ప్రభాసభాగం బ్యాటరీలు, వాటిని విదేశా నుండి దిగుమతి చేసేకోవలసిందే. దిగుమతులు చేసుకున్న వాటిని అసెంబుల్ చేయడం ఆర్.టి.సి వర్క్ షాప్ కార్మికులు చేయగలరు. ఈ విధంగా చేయడం వల్ల విద్యుత్ బస్సుల ఖరీదు గణనీయంగా తగ్గుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి లభిస్తుంది. ప్రయాణికులపై ఛార్జీల భారం తగ్గుతుంది.
డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చవచ్చు. దీనిని “రిట్రోఫిట్” అంటారు. ఎపిఎస్ ఆర్టిసి మరియు టిజిఎస్: ఆర్టిసి లలో ఒక్కొక్క బస్సు చొప్పున మార్చారు. ఇందుకు 70 నుంచి 80 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తున్నది. దేశంలోని ఆర్ టిసిలన్నీ తమకున్న డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చుకోవడానికి అనుమతిస్తే ఆర్టీసీలకు ఉన్న వర్క్ షాపులలో ఈ పని సులభంగా అవుతుంది. ఆ బస్సులు ఆర్ టిసి అధీనంలోనే ఉంటుంది. ఆర్టిసి సిబ్బందే వీటి నిర్వహణ ఆపరేషన్స్ చేయవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు.
వీటన్నింటి సారాంశం రాష్ట్ర ప్రజలపై భారాలు మోపి ప్రజలపై విధించిన పన్నులతో సమకూర్చుకున్నా రూపాయల ప్రజాధనాన్ని కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అవుతున్నది. దీనినే కార్పొరేట్ కమ్యూనల్ ఛాందవ్యం అంటారు. ఈ పరిస్థితుల్లో ఆర్టిసి కార్మికులు, కార్మిక సంఘా ప్రజాసంఘాల లౌకిక శక్తుల మద్దతుతో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ వాహనాల విధానాన్ని నిలువరించడానికి ముందుకు అవసరం ఉన్నది.
ఆర్. లక్ష్మయ్య
రచయిత అఖిలభారత రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ