
అసిస్టెంట్ ప్రొఫేసర్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకూనే ఎస్సీ- ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థుల దరఖాస్తు రుసుములో లభించే రాయితీని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిలిపివేసింది. ఈ చర్యను వివక్షపూరితమైనదిగా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అధ్యాపకులు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫేసర్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థుల దరఖాస్తు రుసుములో రాయితీ విధానాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) నిలిపివేసింది.
ఈ మార్పు విద్యాప్రపంచంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నట్టుగా ఇండియా టుడే కథనం తెలిసింది. వివిధ మీడియా కథనాల ప్రకారం, అధ్యాపకులు- విద్యావేత్తలు ఈ నిర్ణయన్ని “తగనిది” అన్నారు.
జూన్ 10న దౌలత్ రాం కాలేజ్ ఒక సర్క్యూలర్ను జారీ చేసింది. దాని ప్రకారం, ప్రస్తుతం ఓపెన్ కేటగిరి అభ్యర్థుల కోసం దరఖాస్తు రుసుమును రెండువేల రూపాయల వరకు పెంచారు. ఈ రుసుము ఇంతకు ముందు రూ 500గా ఉండేది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. ఇతర వెనుబడిన వర్గాలు(ఓబీసీ), ఆర్ధికపర బలహీన వర్గం(ఈడబ్ల్యూఎస్) అభ్యర్థుల కోసం కూడా ఫీజును రూ 500 నుంచి పెంచి రూ 1500 చేశారు.
ఈ మార్పుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు కోసం వేయి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు వీళ్లు ఎటువంటి రుసుము చెల్లించాల్సి ఉండేది కాదు. వికలాంగ అభ్యర్థుల కోసం రుసుము రూ 500గా నిర్ణయించారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘం, విశ్వవిద్యాలయ విద్యాపరమైన- కార్యనిర్వాహక మండలి సభ్యులను ఈ నిర్ణయంలో జోక్యం చేసుకొని, దీనిని వెనక్కు తీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఈ పెరుగుదల చాలా వివక్షపూరితంగా ఉందని, అంతేకాకుండా ఈ రకంగా దరఖాస్తు రుసుము పెంచడం అణగారిన వర్గాల నుంచి వాచ్చే అభ్యర్థులపై ఆర్థికభారం మోపుతుందని వాళ్లు అభిప్రాయపడ్డారు.
నిర్దేశిత రుసుము లేకుండా పంపిన దరఖాస్తులను అంగీకరించమని సర్క్యూలర్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితులలోనైనా రుసుము వెనక్కు ఇవ్వడం జరగదని తెలియజేశారు. దరఖాస్తుదారులు ఆన్లైన్లో ఫాం నింపాల్సి ఉంటుందని, అవసరమైన అన్ని సర్టిఫికేట్లు, చెల్లింపులు ఆన్లైన్ మాధ్యమంగా పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
డీయూ శాఖ ఫ్యాకల్టీ నియామకాల కోసం విశ్వవిద్యాలయమే ఉమ్మడి ప్రకటనను జారీ చేస్తుంది. అయితే విశ్వవిద్యాలయ నియామాలను అనుసరిస్తూ దౌలత్ రాం లాంటి కొన్ని కళాశాలలు ఖాళీ పోస్టుల భర్తీ కోసం స్వతంత్రంగా జారీ చేయొచ్చు. తాజా విమర్శల మీద ఇప్పటి వరకు విశ్వవిద్యాలయ తరఫున ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
డీయూతో ముడిపడిన ప్రస్తుత ఇతర వివాదాలు..
కొన్ని రోజుల క్రితం అండర్ గ్రాడ్యూయేట్(యూజీ)లో ప్రవేశాల కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అందులో “ముస్లిం”ను మాతృభాష రూపంలో సూచించారు. ఈ పొరపాటును సవరించాలని విజ్ఞప్తులు చేసిన విశ్వవిద్యాలయం స్పందించలేదు. దీంతో విమర్శలు తారాస్థాయికి చేరాయి. రాజ్యాంగ ఎనిమిద ప్రకరణలో ఒక గుర్తింపు పొందిన భాషగా ఉర్దూ ఉన్నప్పటికీ దరఖాస్తులో మాత్రం పేర్కొనబడలేదు.
విశ్లేషకుల అభిప్రాయంలో భాషను మతాన్ని సమాంతరంగా(ఒకే అర్థం వచ్చేటట్లు) జోడించడం, తప్పుదారి పట్టించే రాజ్యంగావిరుద్దమైన చర్య.
“ఇది కేవలం క్లెరికల్ లోపం కాదు. ఇది తీవ్రమైన వివక్షపూరిత మతఛాందస మనస్తత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. అది ఒక పూర్తి సముదాయాన్ని కేవలం మతప్రాదిపకన గుర్తిస్తుంది. అంతేకాకుండా దాని భాషను సాంస్కృతికపరమైన, ప్రాంతీయ గుర్తింపును కనుమరుగు చేస్తుంది. ముస్లిం అనేది ఎటువంటి భాష కాదు. ఆయా ప్రాంతాలలో ఇతరులు మాట్లాడే భాషలను కూడా ముస్లింలు మాట్లాడుతారు. ఎలా అంటే హిందీ, పంజాబీ, బెంగాలి, మళయాళం, తమిళం లేదా ఉర్దూ మాట్లాడినట్టు అన్నమాట.”అని ఢిల్లీ టీచర్స్ ఫ్రంట్ జనరల్ సెక్రటరీ ఆభా దేవ్ హబీబ్ అన్నారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సభ్యులు డా మితురాజ్ ధూసియా ఈ విషయంపై స్పందిస్తూ, “ఢిల్లీ విశ్వవిద్యాలయంలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇటువంటి తప్పులు చేస్తోంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషాదకరమైన విషయంగా చెప్పుకోవాలి. ఇటువంటి చర్యలను వెంటనే ఆపాలి. మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని, బహుభాషా విధానాన్ని స్వీకరించాలి. అంతేకాకుండా నిత్యం గౌరవించాలి” అన్నారు.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే, ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన దరఖాస్తులలో గందరగోళం కేవలం ముస్లిం పదానికి మాత్రమే పరిమితం కాలేదు. దరఖాస్తులో నిర్దిష్టంగా ‘బిహారీ’, ‘చ****’, ‘కూలీ(మజ్దూర్)’, ‘గ్రామీణం(దేహాతి)’, ‘మోచీ’, ‘కుమ్మరి’లాంటి పదాలను కూడా భాష కాలమ్లో ప్రస్థావించారు. కానీ ఇవేవి భాషలు కాదు. జాతి లేదా ప్రాంతం, వృత్తి, పనిలాంటి వివరాలు వెల్లడించే పదాలు మాత్రమే.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దరఖాస్తుకు సంబంధించిన స్క్రీన్షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు- అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని దరఖాస్తు నుంచి వెంటనే తొలిగించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగం స్పందిస్తూ, “మాతృభాష” కాలమ్లో తప్పులు దొర్లాయని అంగీకరించింది. అయితే ఈ తప్పులు సవరించేందుకు చర్యలు తీసుకోకుండా కేవలం “క్లెరికల్ మిస్టెక్స్” అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.
ఈ తప్పును వెంటనే మార్చారని, అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి గందరగోళాలు తలెత్తకుండా తగుచర్యలు తీసుకుంటామని విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనూప్ లేదర్ తెలియజేశారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన వివరణ మీద డీయూ హిందీ విభాగానికి చెందిన ప్రొఫేసర్ అపూర్వానంద్ ఎక్స్ వేదికగా స్పందించారు. “ఎటువంటి సిగ్గు లేదు, ఎటువంటి క్షమాపణ లేదు! మీరు ఢిల్లీ విశ్వవిద్యాలయంలాంటి విశ్వవిద్యాలయంలో ఇటువంటి “అజాగ్రత్త”ను సహిస్తారా? ఇవ్వాళా రేపు “సిగ్గు” అనేది గడిచిన పాతకాలంనాటి మాటలా మారిపోయింది.
అనువాదం: సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.