
హైదరాబాద్ : ఇళ్ళు అపార్ట్మెంట్లు, విల్లాలు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టదల్చుకున్న వాళ్ళు తొలుత సదరు వెంచర్లు ఏమైనా సాగునీటి వనరులు ఆక్రమించి నిర్మించారా అన్న విషయాన్ని ధృవీకరించుకోవాలని
ప్రకృతి వైపరీత్యాల నివారణ ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ సాధికార సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలను కోరారు. సోమవారం నాడు ప్రజావాణిలో దరఖాస్తు లు ఇవ్వటానికి వచ్చిన ప్రజలతో ఆయన ముచ్చటించారు.
” ఆస్తులు కొనేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. కాలువలు నీటి ప్రవాహాల మీద జరిగే శాశ్వత నిర్మాణాలు భవిష్యత్తు లో న్యాయపరమైన సమస్యలకు, పర్యావరణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులు చట్టవిరుద్ధమైనవి నిర్ధారణ అయితే ప్రభుత్వమే కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వవచ్చు. అలాంటి పరిస్థితులు ప్రజలకు ఆర్థిక నష్టాన్ని కలగ చేస్తాయి” అని రంగనాథ్ హెచ్చరించారు.
సోమవారం నాడు హైడ్రా అధికారులకు మొత్తం 47 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికం నాలా సమస్యలు అక్రమ లే అవుట్ సమస్యలు ఉన్నాయని హైడ్రా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.