
మద్రాస్ హైకోర్టు స్వలింగ జంటలను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం వివాహమే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకైక మార్గం కాదని తెలియజేసింది. అంతేకాకుండా ఇటువంటి జంటల కోసం “ఎంపిక చేసుకున్న కుటుంబం” అనే భావన ఎల్జీబీటీక్యూఐఏ+ చట్టంలో గుర్తింపుతో కూడిన ఆమోదం లభించిందని గుర్తుచేసింది.
న్యూఢిల్లీ: స్వలింగ బంధాల గురించి మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేస్తూ “కేవలం వివాహమే కుటుంబ ఏర్పాటుకు ఏకైక విధానం కాదు. ఇటువంటి జంటల కోసం “ఎంపిక చేసుకున్న కుటుంబం” భావనకు ఎల్జీబీటీక్యూఐఏ+ చట్టంలో ఆమోదం లభించబడింది. అంటే, ఒకవేళ ఎవరైనా కోరుకుంటే వివాహం చేసుకోకుండా కూడా ఒక కుటుంబంలా ఉండవచ్చు” అని తెలియజేసింది.
కథనం ప్రకారం, తనకు ఇష్టమైన మహిళతో జీవితం పంచుకోవాలనే కోరిక ఉన్న మరో మహిళకు ఉపశమనమిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. “కుటుంబం ఏర్పాటు కోసం వివాహమే ఏకైక విధానం కాదని, ఎల్జీబీటీక్యూఐఏ+ చట్టంలో దీనికి సంబంధించిన దాని గురించి చాలా బాగా పొందుపరచబడింది” అని తెలియజేసింది.
ఒక 25 ఏళ్ల అమ్మాయికు సంబంధించిన తన తోటి మహిళ హెబియస్ కార్పస్ పిటీషన్ను వేసింది. ఈ పిటీషన్ మీద జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వీ లక్ష్మీనారాయణన్ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే, 25 ఏళ్ల అమ్మాయికు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి కోరికకు విరుద్ధంగా తనను బంధించారు.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం, “బంధించిన వ్యక్తి పిటిషన్దారు(మహిళ)తో వెళ్లే అధికారం ఉంది. అమ్మాయిని తన కుటుంబ సభ్యులు తన కోరికకు విరుద్ధంగా ఆపకూడదు” అని ధర్మాసనం తెలియజేసింది. అమ్మాయి కుటుంబ సభ్యులు “వారి వ్యక్తిగత స్వేచ్ఛలో కలగజేసుకోవడా”న్ని కూడా కోర్టు తప్పుబట్టింది.
ఈ ఇద్దరు అమ్మాయిల జంటకు అవసరానికి అనుగుణంగా తగిన రక్షణ ఇవ్వడానికి ఆ ప్రాంత పోలీసులకు కోర్టు ఆదేశాన్ని జారీ చేసింది.
స్వలింగ జంటల మధ్య వివాహానికి చట్టబద్ధత కల్పించబడలేదని, కానీ వాళ్లు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రియా చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినట్టుగా కోర్టు గుర్తుచేసింది.
అమ్మాయిని అనివార్యంగా తన తల్లిదండ్రులతో వెళ్లేలా చేసినందుకు పోలీసులను కోర్టు విమర్శించింది.
పిటీషన్లో ఎక్కడ కూడా తమ బంధానికి సంబంధించిన వాస్తవరూపం గురించి పిటీషన్దారు ప్రస్థావించలేదని బేంచ్ పేర్కొన్నది. కానీ, స్వయంగా తనను ఒక దగ్గరి మిత్రురాలిగా తెలిపిందని చెప్పుకొచ్చింది. తాము వారి తటపటాయింపును అర్థం చేసుకుంటామని, సమాజం ఇప్పటికి కూడా సంప్రదాయవాదంలో నుంచి బయటకు రాకపోవడానికి ప్రస్తుత పరిస్థితి అద్దంపడుతుందని కోర్టు చెప్పింది.
తమిళనాడులోని వెల్లోర్ జిల్లా గుడియాథం, పుదుచ్చేరి పరిధిలోని రెడ్డీయార్పాలయం ఇంకా కర్ణాటకలోని జీవన్ బీమా నగర్ పోలీసులను కూడా కోర్టు విమర్శించింది. ఎందుకంటే, వాళ్లు పిటీషన్దారు ద్వారా పంపినటువంటి అత్యవసర సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఇంకా తన తోటి అమ్మాయిని తన తల్లిదండ్రులతో అనివార్యంగా వెళ్లేలా చేశారు.
అనువాదం: క్రిష్ణా నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.