
సోషల్ మీడియాలో అనుచిత పోష్టులు పెట్టారని నిన్న దాచేపల్లి పోలీసులు పాలేటి క్రిష్ణవేణి అనే మహిళను అరష్టు చేశారు అనతరం రాత్రి సమయానికి కౌర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసు వారు వైసిపి కార్యకర్తలను పోలీసు స్టేషంకు రానివ్వకుండా గేటుకు బేడీలు వేయటం దీనికి పరాకాష్ట .చాలా కాలంగా ఇలాంటి ఘటనలు (వంశీ, వర్రా, కిరణ్, శ్రీ రెడ్డి, బోరుగడ్డ, పోసాని వంటివి) రాష్ట్రంలో జరగటం సాధారణం అయ్యింది . ఇలా మీడియాలో సంచలనంగా నిలిచే పాలేటి క్రిష్ణవేణి లాంటి కేసులు 1 శాతం ఉంటే నిత్యం అనధికారికంగా పోలీసు స్టేషన్ కు పిలిచి వార్నింగ్ లు ఇచ్చే కేసులు 99 శాతం ఉంటాయి .
పాలక వర్గ పార్టీ లోని చాలా మంది కార్యకర్తలు ప్రత్యర్ధి పార్టీలను భూతులు తిట్టటమో లేక వ్య్వక్తిగత విషయాలపై ట్రోల్సు చేయటమే రాజకీయాలు అనుకునే స్థాయికి దిగజారారు , అలా చేసే వారిని ఆ పార్టీల నాయకత్వాలు మందలించకపోగా ఇంకా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు అనుచుత వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా అరష్టు చేస్తే తప్పేమిటి అని చెప్పే అధికార పార్టీ వారే ఇలాంటి వ్యాఖ్యలు అనేకం చేసి ఉంటారు, ఇంకా చేస్తునే ఉన్నారు. వాక్ స్వాతంత్రం , ప్రజ్యాస్వామ్యం , చట్టాలు,వ్యక్తిగత స్వేచ్చ అని ఇప్పుడు మాట్లాడే ప్రతిపక్షం వారే అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది పై కేసులు పెట్టించారు లేదా పోలీసుల ద్వారా హెచ్చరికలు/హింస చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
రాజకీయ అత్యుత్సాహంతో బలవుతున్న సామాన్యులు
చాలా మంది ఈ పార్టీల కార్యకర్తలు తమ అధినాయకత్వం మీద ఉన్న అతి అభిమానంతో ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్సు లేదా అనుచిత పోష్టులు పెడుతున్నారు, అధికారం పోయాక లేదా ప్రతిపక్షం లో ఉన్నవారు బలవుతున్నారు. సమాన్య కార్యకర్తలకు వీరి పార్టీలు చేసే న్యాయ సాయం కూడా తక్కువే మహా అయితే తరవాత పిలిచి మనం అధికారం లోకి తొందరలో వస్తున్నాం అప్పుడు నీకు మేలు చేస్తా అనే హామీ తప్పితే వీరికి లభిచే భరోసా ఏమి లేదు. రాష్ట్రంలోని ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తలకు రాజకీయ విజ్ఞానం కలిగించటానికి చేసే ప్రయత్నాలు సూన్యం , కేవలం సోషల్ మీడియా రాష్ట్ర సెంటర్ ఒకటి పెట్టుకోని దాని నుండి కింది కార్యకర్తలకు ఇలాంటి అనుచిత పోస్టులు, మెసేజీలు పంపటం చేస్తుంది, అది చూసిన కొంది కార్యకర్తలు గుడ్డి అభిమానం, ప్రత్యర్ధి పార్టీ లేదా వ్యక్తి మీద వ్యతిరేకతతో సోషల్ మీడియాలో షేర్లు లేదా పోస్టులు చేసి బలి అవుతున్నారు . అసలు ఈ పని చేయించే వారంతా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోని తమ దాకా వస్తే మందస్తు బెయిల్లు వంటివి పొందుతున్నారు. చాలా సందర్భాలలో బలవుతుంది బలహీనమైన కింది స్థాయి కార్యకర్తలే అనేది తెలుస్తుంది .
స్వాంత్రత కోల్పోయిన పోలీసు వ్యవస్థ
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తోకగా లేక వారి కార్యకర్థలుగా మారినట్టుగా చాలామందికి అనుమానం కలుగుతుంది . ఎందుకంటే ఆ మండల , నియోజకవర్గ పరిధిలో పాలక పార్టీ నాయకుల ఆజ్ఞ లేకుండా కేసులు నమోదు కూడా చేయటం లేదు. సోషల్ మీడియాలో అనుచిత పోష్టులు పెట్టారని ఎవరైనా పాలక పార్టీ నాయకుడు పోలీసు వారికి చెప్తే వారు చట్టాలకు లోబడి పని చేయకుండా పెట్టిన వారిని పిలిపించి బెదిరించటమో లేక కొట్టటమో చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా చట్టపరంగా నడుచుకోవటం లేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎప్పుడో సంవత్సరాల క్రితం పెట్టిన వాటి మీద ఇప్పుడు కేసులు నమోదు చేసి రిమాండ్లకు పంపుతున్నారు, కోర్టులు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మండి పడుతున్నా అవి ఆగటం లేదు. ఇవన్నీ చూస్తే కేవలం రాజకీయ వేధింపులు తప్పితే ఇంకోలా కనపడటం లేదు .
పరువునష్టం దావా అంటే?
పరువునష్టం దావా ఐపిసి 499, 500 అంటే సమాజంలో ఒక వ్యక్తి యెక్క పరువు,గౌరవ మర్యాదలకు నష్టం వాటిల్లే విధంగా మాట్లాడం లేదా లిఖిత పూర్వంగ పేపర్, పామ్ప్లేట్ రూపంలో ప్రచురించడం లేదా సైగల రూపంలో లేదా వీడియోలలో చేసినట్టు అయితే పరువు నష్టం దావా వేయొచ్చు.
ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి భారతీయునికి సమాజంలో గౌవరవంగా, మర్యాదగా జీవించే హక్కు ఉంది దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు ఒక వేళ అలా చేస్తే మనం పరువునష్టం దావా వేసి నష్టపరిహారం రూపంలో డబ్బు అడగచ్చు లేదా ఆర్టికల్ 499, 500 ప్రకారం 1 లేదా 2 సంవత్సరాల శిక్ష లేదా జరిమానా లేదా రెండు పడే అవకాశం ఉంది.
మరింత క్లుప్తంగా చెప్పాలంటే ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు ఎదో ఒక స్కాం చేసి సాక్ష్య ఆధారాలతో దొరికి కోర్టులో నిరూపీతం అయి శిక్ష పడింది శిక్ష అయిపోయిన తరువాత మళ్ళీ ఎలక్షన్లో నిలపపడ్డాడు అప్పుడు ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో నువు లంచ గోండివి, స్కామ్స్ చేస్తావ్ ప్రజల సొమ్ము తింటావ్ అని కామెంట్ చేస్తాడు.ఆ కామెంట్ ఆ రాజకీయ నాయకుడు చూసి తన పలుకుబడితో పోలీస్ వారితో పరువు నష్టం దావా వేసి అరెస్ట్ చేపిస్తే అప్పుడు పరువునష్టం దావా అనేది పనిచేయొదు ఎందుకు అంటే అతను మాట్లాడింది నిజం సాక్ష్యం ఆధారాలు ఉన్నాయి కాబట్టి అదే ఎ సాక్ష్యం ఆధారం లేకుండా ఆరోపణ చేస్తే పరువు నష్టం దావా వర్తిస్తుంది
చట్ట ప్రకారం అనుచిత వ్యాఖ్యలు అనేవి వ్యక్తులకు, సంస్థలకు పరును నష్టం కలిగితే పనిషబుల్ (సివిల్ కేసు) గా చూస్తాయి అలాగే ఇది బెయిలబుల్ కేసు అవుతుంది. అలాగే హింసకు కారణం అయినా లేక సమాజంలో అనిస్చితి కి కారణం అయ్యే వ్యాఖ్యలు వంటివి క్రిమినల్ ఎఫెన్సుగా చూడబడతాయి కానీ రాష్ట్రంలో పోలీసులు నమోదు చేస్తున్న అన్ని కేసులు నాన్ బెయిలబుల్ గా నమోదు చేసి నిందితులను రిమాండ్ కు పంపిస్తున్నారు అవి కోర్టుల్లో నిలవటంలేదు కానీ నిందితులను వేధించటానికి మాత్రం పనికొస్తున్నాయి.
ఇదే దీర్ఘకాలం కొనసాగితే చట్టాలు వ్యవస్థల మీద సమాన్యులులకు ఇప్పటికే సన్నగిల్లిన నమ్మకం పూర్తిగా పోయి అరాచకం పూర్తిస్థాయిలో రాజ్యమేలుతుంది , ఒక పద్దతిగా ఈ అరాచకాలను వెనక్కునెడితే తప్ప వ్యవస్థలను కాపాడుకోలేము
ఆంజనేయ రాజు, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) పల్నాడు జిల్లా కార్యదర్శి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.